News April 9, 2025
చంద్రగిరిలో మైనర్ బాలిక పరువు హత్య..?

చంద్రగిరి(M) నరసింగాపురంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నిఖిత(17)ను శుక్రవారం కన్న తల్లిదండ్రులే చంపి కననం చేసినట్లు సమాచారం. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణం అని తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News September 19, 2025
NGKL: సీఎంకు ఆహ్వానం అందజేత

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డిని ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ సభ్యులు ఆహ్వానించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి వారు గురువారం హైదరాబాద్లోని సీఎం నివాసంలో ఆహ్వాన పత్రికను అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జూలూరి రమేష్ బాబు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
News September 19, 2025
VKB: ‘సర్వే రిపోర్ట్ నివేదిక సరైన విధంగా అందించాలి’

జిల్లా సర్వే నివేదిక రిపోర్టు సంబంధిత శాఖలు సమన్వయంతో రిపోర్ట్ తయారు చేసి అందజేయాలని అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో పరిశ్రమలు సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అదన కలెక్టర్ మాట్లాడుతూ.. రిపోర్టు ఆధారంగానే జిల్లాలో పరిశ్రమలకు, ఇసుక, పర్యావరణ అనుమతులకు అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
News September 19, 2025
NGKL: సోషల్ మీడియా ప్రకటనలు నమ్మోద్దు: ఎస్పీ

సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన బంపర్ ఆఫర్లు, దసరా బహుమతుల ప్రకటనలను నమ్మోద్దని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రజలకు సూచించారు. తక్కువ ధరలకే వస్తువులు ఇస్తామని వచ్చే మోసపూరిత సందేశాలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. స్పిన్ వీల్, స్క్రాచ్ కార్డుల లాంటి లింకులను అస్సలు క్లిక్ చేయవద్దని ఆయన తెలిపారు.