News June 29, 2024
చంద్రబాబును కలిసిన TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719594338860-normal-WIFI.webp)
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా శుక్రవారం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని ఉండవల్లిలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. పల్లా శ్రీనివాసరావు సమర్థ నాయకత్వంలో పార్టీ మరెన్నో విజయాలను సాధిస్తుందని, మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Similar News
News July 1, 2024
మండవల్లిలో జాతీయ రహదారిపై తిరగబడిన లారీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719756970554-normal-WIFI.webp)
మండవల్లిలో కైకలూరు సందు వద్ద జాతీయ రహదారిపై ధాన్యం లారీ తిరగబడింది. స్థానికుల వివరాల ప్రకారం.. జాతీయ రహదారి మరమ్మతుల్లో భాగంగా కైకలూరు సందు వద్ద రోడ్డు కటింగ్ పనులు చేస్తున్నారు. తణుకు నుంచి సింగరాయపాలెంకు ధాన్యం లోడుతో వెళుతున్న లారీ సాయంత్రం 6.30 సమయంలో మట్టిలో దిగబడి తిరగబడింది. వేసవిలో చేయాల్సిన పనులను కాంట్రక్టర్ వర్షాకాలంలో చేపట్టారని దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు.
News July 1, 2024
తొలిరోజే పింఛన్ 100 శాతం పంపిణీ పూర్తిచేయాలి: కలెక్టర్ సృజన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719762902217-normal-WIFI.webp)
జులై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల మొత్తాన్ని లబ్ధిదారులకు ఇళ్ల వద్దే అందించే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సృజన ఆదేశించారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద చేపట్టే సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలిరోజే 100 శాతం పంపిణీ పూర్తిచేసేలా కృషిచేయాలన్నారు.
News July 1, 2024
నేటినుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కృష్ణా జిల్లా కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719759618850-normal-WIFI.webp)
జూలై 1వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వయంగా స్వీకరిస్తామని అన్నారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.