News September 14, 2024
చంద్రబాబును గిన్నిస్ బుక్కు ఎక్కించాలి: ఎస్వీ మోహన్ రెడ్డి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92024/1726283715727-normal-WIFI.webp)
సీఎం చంద్రబాబుపై కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. వైఎస్ జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసి NMC మంజూరు చేసినా సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబును గిన్నిస్ బుక్కు ఎక్కించాలని విమర్శించారు. పేద విద్యార్థులు డాక్టర్ కావాలనే కలలపై CBN నీళ్లు చల్లారని ఎస్వీ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇది దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు.
Similar News
News December 21, 2024
దివ్యాంగురాలితో ప్రేమ వివాహం.. ఆటో డ్రైవర్ గొప్ప మనసు..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734773771990_51181747-normal-WIFI.webp)
ఆటో డ్రైవర్ గొప్ప మనసు చాటుకున్నాడు. దివ్యాంగురాలిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలిచాడు. సీ.బెళగల్(మం) పొనకల్కు చెందిన దివ్యాంగురాలు వెంకటేశ్వరమ్మ, గూడూరు(మం) సంగాలకు చెందిన ఆటో డ్రైవర్ మద్దిలేటి ప్రేమించుకున్నారు. నందవరం(మం) గురజాలలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో దివ్యాంగుల సాధికారత ఫోరం JAC అధ్యక్షుడు నాగరాజు సమక్షంలో శనివారం పెళ్లి చేసుకుని ఇద్దరూ ఒక్కటయ్యారు.
News December 21, 2024
441 మంది విద్యార్థులతో ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734769299874_50299483-normal-WIFI.webp)
కర్నూలులోని ఓ పాఠశాల ఆవరణలో 441 మంది విద్యార్థులతో 1వ ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలను శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి పుల్లారెడ్డి కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సురేశ్, ప్రధానోపాధ్యాయురాలు మీనాక్షి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విద్యావేత్త రాజశేఖర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించారు.
News December 21, 2024
అనంతపురంలో కర్నూలు జిల్లా బాలుడి ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734759584793_727-normal-WIFI.webp)
ఇష్టం లేని పని చేయలేక ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం అనంతపురంలో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబలంకి చెందిన శివ (14) తల్లిదండ్రుల బలవంతంపై అనంతపురంలో తన అన్నతో కలిసి సెంట్రింగ్ పనులు చేస్తున్నాడు. తాను వ్యవసాయం చేసుకుంటానని సెంట్రింగ్ పనులు చేయలేనని తల్లిదండ్రులకు చెప్పినా వినకపోవడంతో అనంతపురంలోని తన గదిలో ఉరేవేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు టూ టౌన్ పోలీసులు తెలిపారు.