News August 7, 2025
చంద్రబాబు పాలనపై వ్యతిరేకతే ఈ ఫలితానికి కారణం: బొత్స

జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి 50 ఓట్లతో గెలుపొందడంపై విశాఖలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. కూటమి కార్పొరేటర్లే వైసీపీకి ఓటు వేయడం చంద్రబాబు పాలనపై వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. 32 మంది బలంతో 50 ఓట్లు రావడం విశేషమని, ఇది కూటమిపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని చూపుతోందన్నారు. సభలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.
Similar News
News August 7, 2025
ఎయిర్పోర్ట్ పరిసరాల్లో శుభ్రతకు చర్యలు తీసుకోండి: కలెక్టర్

ఎయిర్పోర్ట్ పరిసరాల్లో అపరిశుభ్రత ఉండకూడదని, డ్రెయిన్లు సాఫీగా పని చేసేలా చూడాలని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచించారు. ట్రక్ పార్కింగ్ సమీపంలో ఆహారపు ప్యాకెట్లు వేయకుండా డ్రైవర్లకు అవగాహన కల్పించాలని, పక్షుల ఆకర్షణ నివారించాలన్నారు. పూడిక, చెత్తను తొలగించాలన్నారు. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ పురషోత్తం పర్యావరణంపై గమనించిన సమస్యలను వివరించారు. అధికారుల సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
News August 6, 2025
GVMC స్థాయీ సంఘం సభ్యులు వీరే..

GVMC స్థాయీ సంఘం ఎన్నికల ఫలితాలను కమిషనర్ కేతన్ గార్గ్ ప్రకటించారు.
➣నీలిమ కొణతాల – 58 ➣గంకల కవిత – 57 ➣దాడి వెంకట రామేశ్వరరావు- 57
➣మొల్లి హేమలత 57 ➣సేనాపతి వసంత – 54 ➣ గేదెల లావణ్య – 53
➣మాదంశెట్టి చినతల్లి – 52 ➣రాపర్తి త్రివేణి వరప్రసాదరావు – 52
➣మొల్లి ముత్యాలు – 51 ➣పద్మా రెడ్డి 50 ఓట్లతో గెలిచారు.
వీరికి కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు.
News August 6, 2025
నులిపురుగుల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోండి: కలెక్టర్

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో ఆల్బెండజోల్ మాత్రలు వైద్యుల సమక్షంలోనే వేయాలని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. ఆగస్టు 12న 1-19 ఏళ్ల పిల్లలకు ఉచితంగా మాత్రలు పంపిణీ చేయనున్నారు. ఆరోజు అందుబాటులో లేని వారికి 20న పంపిణీ చేస్తారు. ఖాళీ కడుపుతో మాత్రలు వేయకూడదని, ప్రాణాంతక రియాక్షన్లు నివారించేందుకు మెడికల్ కిట్, అంబులెన్స్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు.