News October 16, 2024

చంపావతిలో కళేబరాలు కొట్టుకురాలేదు: కలెక్టర్

image

చంపావతి నదిలో కళేబరాలు కొట్టుకురావడం వల్లనే నీరు కలుషితమై గుర్లలో అతిసారం ప్రబలిందనే వార్త అపోహ మాత్రమేనని కలెక్టర్ అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఆ నీటిని పరీక్షలు జరపగా నెగటివ్ వచ్చిందని, కలుషితం కాలేదని తెలిపారు. వదంతులను ప్రజలు నమ్మవద్దని, ప్రస్తుతం పరిస్థితి అంతా అదుపులోనే ఉందని వెల్లడించారు. చంపావతి నది నీరు 26 గ్రామాలకు సరఫరా అవుతుందని, ఏ గ్రామం లో కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని పేర్కొన్నారు.

Similar News

News October 16, 2024

బొత్స ఫొటో వైరల్.. ఖండించిన అనుచరులు

image

శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జనసేనలో చేరుతారంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీన్ని ఆయన అనుచరవర్గం తీవ్రంగా ఖండించింది. గడిచిన 32 ఏళ్ల నుంచి DCCB బ్యాంకు నుంచి బొత్స సిరిమానోత్సవాన్ని తిలకించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపింది. ఈ నేపథ్యంలో DCCB కార్యాలయంలో కూర్చున్న ఫొటో ఆధారంగా అసత్య ప్రచారం చేయడం సరికాదంటూ మండిపడింది.

News October 16, 2024

విశాఖకు తలమానికంగా అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్: MP

image

విశాఖపట్నానికి తలమానికంగా అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నిలవబోతోందని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు. భోగాపురంలో విమానాశ్రయం వద్ద GMR సంస్థ ప్రతినిధులతో బుధవారం భేటీ అయ్యారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. వచ్చే 50ఏళ్లను దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి రాకపోకలు సులభతరం చేయడానికి అవసరమైన మార్గాల అభివృద్ధిపై చర్చించామని చెప్పారు.

News October 16, 2024

VZM: డయేరియా మరణాలపై సీఎం ఆరా

image

గుర్లలో డయేరియాతో ఐదుగురు మృతి చెందడంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మంగళవారం ఒక్కరోజే నలుగురు మృతి చెందారన్న సమాచారంపై సీఎం ఆరా తీశారు. ప్రస్తుతం బాధితులకు అందుతున్న చికిత్స, వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.