News September 4, 2024
చక్రాయపేట: గండి ఆలయ హుండీల లెక్కింపు
పుణ్యక్షేత్రమైన గండిలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. కడప దేవాదాయశాఖ సూపరింటెండెంట్ రమణమ్మ పర్యవేక్షణలో 55 రోజులుగా భక్తులు స్వామివారికి హుండీల ద్వారా సమర్పించిన కానుకలను లెక్కించినట్లు తెలిపారు. 7 శాశ్వత హుండీల ద్వారా రూ. 36,48,364, అన్నప్రసాద వితరణ హుండీ ద్వారా రూ. 62,317ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
Similar News
News September 29, 2024
రాజంపేట: బంగారు నగలు చోరీ
రాజంపేట పట్టణంలోని శ్రీకృష్ణదేవ రాయలు నగర్లో నివాసం ఉండే రవి ఇంట్లో చోరీ జరిగిందని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు బద్దలు కొట్టి 70 గ్రాములు బంగారు నగలు చోరీ చేసినట్లు బాధితుడు పేర్కొన్నారు. ఇంటి పరిసర ప్రాంతాలను సీఐ ఎల్లమ రాజు, ఎస్సై ప్రసాద్ రెడ్డి పరిశీలించారు. అయితే జిల్లాలో వారం రోజుల్లో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
News September 29, 2024
ముద్దనూరు వద్ద అదుపుతప్పి లారీ బోల్తా
కడప జిల్లా ముద్దనూరు మండలంలోని నల్లబల్లె రహదారిపై ఆదివారం తెళ్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ముద్దనూరు నుంచి తాడిపత్రి బైపాస్ పనుల కొరకు కంకర లోడ్తో వెళ్తున్న ఓ టిప్పర్ ఉదయం 2.30 సమయంలో అదుపు తప్పి పంట పొలాల్లో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఒకేసారి పదుల సంఖ్యలో టిప్పర్లు వెళ్తుండగా వెనక టిప్పర్కు దారిచ్చే ప్రయత్నంలో ప్రమాదం జరిగిందన్నారు.
News September 29, 2024
చక్రాయపేటలో ఆరేళ్ల బాలికపై అత్యాచార యత్నం
కడప జిల్లా చక్రాయపేట మండలంలో నెరుసుపల్లె గ్రామం అప్పిరెడ్డిగారిపల్లెలో శివాజీ అనే యువకుడు, శనివారం ఆరేళ్ల బాలికకు చాక్లెట్ ఆశ చూపి అత్యాచారయత్నానికి ఒడిగట్టినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆ బాలికను కడప రిమ్స్కు తరలించినట్లు తెలిసింది. పోలీసులు అత్యాచార యత్నానికి పాల్పడిన యువకుడు శివాజీని అరెస్టు చేసి ఫోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం.