News November 4, 2025

చరిత్ర తెలియకుండా సీఎం మాట్లాడుతున్నారు: నిరంజన్ రెడ్డి

image

ఎస్‌ఎల్‌బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్)కి 1994లోనే కేంద్రం పర్యావరణ అనుమతులు ఇచ్చిందని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. 2014 వరకు టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు టన్నెల్‌ను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. 2004లో జలయజ్ఞంలో భాగంగా పనులు ప్రారంభించినప్పటికీ, చరిత్ర తెలియకుండా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం బాధ్యతారాహిత్యం అని ఆయన విమర్శించారు.

Similar News

News November 5, 2025

పార్టీనే నాకు దైవం: కేశినేని చిన్ని

image

AP: తాను చంద్రబాబుకు వీర భక్తుడినని MP కేశినేని చిన్ని పేర్కొన్నారు. 20 నిమిషాల పాటు క్రమశిక్షణ కమిటీకి వివరణిచ్చి ఆయన వెళ్లిపోయారు. ‘పార్టీయే నాకు దైవం, చంద్రబాబు మాకు సుప్రీం. నాకు తిరువూరులో జరిగిన అవమానం కంటే MLA వల్ల పార్టీకి ఎక్కువ నష్టం జరిగింది. నియోజకవర్గ కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీ నిర్ణయం ఉంటుందని అనుకుంటున్నా’ అని వ్యాఖ్యానించారు. ఈ తిరువూరు ఎపిసోడ్‌పై లోకేశ్ నివేదిక కోరారు.

News November 5, 2025

కామారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్.. 43 మందికి శిక్షలు

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి 43 మందికి కోర్టు శిక్షలు విధించింది. మద్యం తాగి వాహనం నడిపిన ఆరుగురు వ్యక్తులకు న్యాయస్థానం 1 రోజు జైలు శిక్షతోపాటు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది. వీరిలో కామారెడ్డిలో ఇద్దరు, మాచారెడ్డి, దోమకొండ, తాడ్వాయి ప్రాంతాల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. మిగిలిన 37 మంది వాహనదారులకు రూ.37 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

News November 5, 2025

నిజామాబాద్: ఇద్దరికి జైలు శిక్ష

image

నవీపేట్ మండలం లింగాపూర్ గ్రామంలో 2020 సంవత్సరంలో పొలం వివాదంలో గొడవ కారణంగా కేశపురం మహేశ్ పై గడ్డపారతో దాడి చేయగా గగ్గోని నవీన్, గగ్గోని హనుమాన్లుపై కేసు నమోదైంది. కేసు విచారణలో భాగంగా ఈరోజు నిజామాబాద్ స్టేషన్ కోడ్ జడ్జి సాయిసుధా ఇద్దరు నిందితులను దోషులుగా తేల్చి గగ్గోని నవీన్‌కు ఐదేళ్లు, హనుమాన్లుకు మూడేళ్ల జైలు శిక్ష విధించారని నవీపేట్ ఎస్ఐ తిరుపతి తెలిపారు.