News February 8, 2026
చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా

యూఎస్ఏపై విజయంతో టీమ్ ఇండియా T20IWCలో వరుసగా అత్యధిక మ్యాచులు గెలిచిన జట్టుగా నిలిచింది. 2024 నుంచి ఇప్పటివరకు వరుసగా 9 మ్యాచులు గెలిచింది. దీంతో సౌతాఫ్రికా(2024లో 8విజయాలు)ను దాటేసింది. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా(8wins) ఉంది. అటు WCలో వన్డే, టీ20ల్లో కలిపి ఓవరాల్గా టీమ్ ఇండియా 100 విజయాలు పూర్తి చేసుకుంది. ఆస్ట్రేలియా(108) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో టీమ్ కావడం గమనార్హం.
Similar News
News February 13, 2026
మున్సిపాలిటీలపై ‘హస్తం’

TG: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ ప్రతిపక్షాలకు అందనంత దూరంలో నిలిచింది.
➤ మున్సిపాలిటీలు..
* కాంగ్రెస్ – 64
* బీఆర్ఎస్ – 15
* హంగ్ – 36
* ఇతరులు – 1, * బీజేపీ – 0
➤ వార్డులు * కాంగ్రెస్ – 1346, బీఆర్ఎస్ – 723, బీజేపీ – 261, ఇతరులు – 252
News February 13, 2026
బంగ్లాలో అధికారంలోకి BNP.. భారత్కు తొలి అభ్యర్థన!

భారత్లో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ PM హసీనాను అప్పగించమని కోరతామని అక్కడి తాజా ఎన్నికల్లో గెలుపొందిన BNP ప్రకటించింది. ఇప్పటికే ఆ మేరకు అభ్యర్థనలు పంపిన విషయాన్ని గుర్తు చేసింది. పొరుగుదేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని, విదేశాంగ శాఖల స్థాయిలో దీని పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని స్పష్టం చేసింది. 2024 ఆగస్టులో భారత్కు వచ్చిన హసీనాకు బంగ్లాలోని ICJ కోర్టు మరణశిక్ష విధించింది.
News February 13, 2026
YCPని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది: పవన్ ఎద్దేవా

AP: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ నేతలు వెల్లోకి దూసుకొచ్చి రభస చేయడంపై Dy.CM పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కాగితాలు చించి విసరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అసెంబ్లీలో 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పడిపోయిన YCPని చూసి ఏం చేయకూడదో, ఏం చేయాలో వంటి చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉందని ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు.


