News August 19, 2025
చర్లపల్లి: నాయుడుపేట వెళ్లే ప్రజలకు గుడ్న్యూస్

సిటీ నుంచి నాయుడుపేట వెళ్లే ప్రయాణికులకు రైల్వే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. రెగ్యులర్గా చర్లపల్లి నుంచి చెన్నయ్ వెళ్లే రైలు నాయుడుపేట మీదుగా వెళ్తుంది. అయితే అక్కడ స్టాపేజ్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. ప్రయాణికుల కోరిక మేరకు నాయుడుపేటలో స్టాప్ ఏర్పాటు చేశారు. దీంతో చర్లపల్లి- చెన్నై ఎక్స్ప్రెస్ ట్రైన్ (12604) ఇక నుంచి 2 నిమిషాల పాటు నాయుడుపేటలో ఆగుతుంది.
Similar News
News August 19, 2025
HYD: జాగ్రత్త.. వీడియో కాల్ న్యూడ్ కాల్గా మారుస్తున్నారు

సైబర్ నేరగాళ్లు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. డేటింగ్ యాప్లో పరిచయం చేసుకొని వీడియో కాల్స్ మాట్లాడించి ఆ తర్వాత దానిని మార్ఫింగ్ చేసి నగ్న వీడియోగా మార్చి బెదిరిస్తున్నారు. గుడిమల్కాపూర్కు చెందిన యువకుడి నుంచి రూ.1.80 లక్షలు వసూలు చేశారు. తిరిగి లక్షల్లో డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వారితో అసలు వీడియో కాల్లో మాట్లాడవద్దని సైబర్ పోలీసులు చెబుతున్నారు.
News August 19, 2025
గతంలో 3 నెలలు ఊచలు లెక్కించిన ‘సృష్టి’ నమ్రత

అక్రమ సరోగసి కేసులో అరెస్ట్ అయిన డా.నమ్రత గతంలో 3 నెలలు జైలులో ఉండి వచ్చారు. 2020లో ఏపీలోని మాడుగులకు చెందిన ఓ మహిళ నమ్రతపై ఫిర్యాదు చేయడంతో జైలుకు వెళ్లింది. తనకు మాయమాటలు చెప్పి తన బిడ్డను తీసుకున్నారని ఫిర్యాదు చేయడంతో ఏపీ పోలీసులు విశాఖ జైలుకు తరలించారు. జైలు నుంచి తిరిగి వచ్చినా నమ్రత దందా కొనసాగించి ఇటీవల మళ్లీ అరెస్ట్ అయింది.
News August 19, 2025
HYD: నిమజ్జనోత్సవానికి ఖర్చు రూ.30 కోట్లు

నిమజ్జనోత్సవం.. HYDలో ఈ వేడుక ఉంటే సందడేవేరు. ఇందుకు GHMC దాదాపు రూ.30 కోట్లు ఖర్చు చేయనుంది. అలాగే సెప్టెంబరు 6న జరిగే శోభాయాత్ర, నిమజ్జనాలకు బల్దియా అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్ల మరమ్మతులు, విద్యుత్ తీగలకు సమస్యలు రాకుండా చర్యలు, అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలను తొలగింపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. వినాయకచ చవితి (27న) మూడో రోజు నుంచే (29న) HYDలో నిమజ్జనాలు ప్రారంభమవుతాయి.