News September 17, 2025

చర్లపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద సంచిలో మహిళ డెడ్‌బాడీ

image

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. దుండగులు ఆమెను హత్య చేసి, సంచిలో కుక్కి ఆటో స్టాండ్ వద్ద పడేసి వెళ్లినట్లు తెలుస్తోంది. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News September 17, 2025

HYD: దక్కన్ రేడియోలో నిజాం ఏం చెప్పారంటే?

image

‘నా ప్రియమైన ప్రజలారా హమ్ నే భారత్‌కే సదర్ గవర్నర్ జనరల్ రాజగోపాల చారి గారికి పంపుతున్న సందేశం ఏమిటంటే.. నా రాజీనామా సమర్పించడంతోపాటు రజాకారులను నిషేధించమని కోరుతూ HYD సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటూ ఇస్తున్న సందేశం. ఇకనుంచి ఇక్కడి ప్రజలు భారత ప్రజలతో కలిసి కులమతాలకు అతీతంగా సుఖ సంతోషాలతో భేద భావాలు లేకుండా సామరస్యంగా ఒకే తాటిపై జీవించాలని కోరుతున్నా’ అని ప్రసంగించారు.

News September 17, 2025

1948 SEP 17 తర్వాత HYDలో ఏం జరిగింది?

image

‘ఆపరేషన్ పోలో’ తర్వాత HYD సంస్థానాదీశుడు నిజాం భారత ప్రభుత్వానికి తలొగ్గారు. ‘గోల్కొండ ఖిల్లా కింద ఘోరి గడతాం’అని ఎవరిపై ప్రజలు తిరగబడ్డారో ఆయనను ప్రభుత్వం తెలంగాణకు రాజ్ ప్రముఖ్‌గా నియమించి గౌరవించింది. ఆ తర్వాత ఆయనకు ప్రత్యేక సెక్యూరిటీ కల్పించింది. రజాకార్లకు నాయకత్వం వహించిన ఖాసీం రజ్వీని పాకిస్థాన్‌కు పంపింది. 1952లో జనరల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి. ప్రజలను పీడించిన ప్రభువుల కథ సుఖాంతం అయింది.

News September 17, 2025

HYDలో గోల్డ్ షాపు యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు

image

తెల్లవారుజామునుంచే HYDలోని ప్రముఖ గోల్డ్ షాపు యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు చేస్తోంది. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకల నేపథ్యంలో ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. వరంగల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.