News January 6, 2026
చలిగా ఉందని వేడి నీటితో స్నానం చేస్తున్నారా?

చలికాలంలో వేడి నీళ్లతో స్నానం హాయిగా అనిపించినా లేనిపోని సమస్యలొస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొగలు కక్కే నీటితో స్నానం చేస్తే ‘చర్మంపై ఉండే సహజ నూనెలు తొలగిపోతాయి. ఆపై చర్మం పొడిగా మారి దురద, పగుళ్లు ఏర్పడతాయి. తలస్నానం చేస్తే జుట్టు పొడిబారి, బలహీనమై రాలిపోతుంది. శరీర ఉష్ణోగ్రతతో పాటు బీపీ పెరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి’ అని సూచిస్తున్నారు.
Similar News
News February 21, 2026
బొప్పాయి తోటల్లో గొంగళి పురుగుల నివారణ ఎలా?

బొప్పాయి పంట చుట్టూ ఎర పంటలుగా అలసందలు, ఆముదం వేయాలి. కలుపు నివారించాలి. తొలి దశలో ఎకరాకు 2-3 దీపపు ఎరలను అమర్చాలి. ఆకు కింది భాగంలో లార్వాల నిర్మూలనకు వేప కషాయాన్ని పిచికారీ చేయాలి. గొంగళి పురుగుల నివారణకు లీటరు నీటికి క్లోరోపైరిపాస్ 2ml లేదా ప్రొపినోపాస్ 2ml లేదా క్వినాల్పాస్ 2ml కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉద్ధృతి ఎక్కువ ఉంటే లీటరు నీటికి లామ్డాసైహలోత్రిన్ 1mlను కలిపి పిచికారీ చేయాలి.
News February 21, 2026
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో ఉద్యోగాలు

<
News February 21, 2026
రెండో పెళ్లిపై మీనా క్లారిటీ

తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని నటి మీనా తెలిపారు. ‘నా సెకండ్ మ్యారేజ్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. రూమర్స్ స్ప్రెడ్ చేసే వారు నాకు టీనేజ్ కూతురు ఉందన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఇలాంటి వార్తలు చూసినప్పుడు బాధగా ఉంటుంది, కోపం వస్తుంది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మీనా భర్త విద్యాసాగర్ 2022లో మరణించారు. ప్రస్తుతం ఆమె మోహన్లాల్తో ‘దృశ్యం-3’లో నటిస్తున్నారు.


