News February 15, 2026
చల్లని నీరు Vs వేడి నీరు.. స్నానానికి ఏది బెటర్!

స్నానానికి వేడి నీరు బెటరా? చల్లని నీరు మేలా? అంటే రెండూ మంచివేనంటున్నారు నిపుణులు. చల్లటి నీటితో ఇమ్యూనిటీ, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయని, రక్తప్రసరణ మెరుగవుతుందని అంటున్నారు. వేడి నీళ్లతో కండరాలు రిలాక్స్ అవుతాయని, ఒత్తిడి తగ్గుతుందని పేర్కొంటున్నారు. నిద్ర ఇంప్రూవ్ అవుతుందని చెబుతున్నారు. మొత్తంగా ఉదయం చల్లటి నీళ్లు, రాత్రి గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే బెటర్ అని సూచిస్తున్నారు.
Similar News
News February 17, 2026
రాగి పంటకు నీరు అందించడంలో జాగ్రత్తలు

రాగి పంటకు నీటిని అందించే విషయంలో రైతులు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. నాట్లు వేసిన రాగి పొలంలో పైరు బాగా వేర్లు తొడిగే వరకు అంటే సుమారు 10 రోజుల వరకు నీరు పెట్టకూడదని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రాగి పంట సాధారణంగా వర్షాధార పంట అయినప్పటికీ కీలక దశలైన మొలకెత్తే దశ, పూత, గింజ పాలు పోసుకునే దశల్లో నీటి తడులను ఇస్తే దిగుబడి బాగుంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.
News February 17, 2026
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో 46 పోస్టులు.. అప్లై చేశారా?

ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, గుజరాత్ స్పోర్ట్స్ కోటాలో 46 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, టెన్త్ అర్హతతో పాటు క్రీడల్లో( జాతీయ, అంతర్జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ, ఖేలో ఇండియా ) పతకాలు సాధించినవారు FEB 21 వరకు అప్లై చేసుకోవచ్చు. MTS పోస్టులకు 18-25ఏళ్ల మధ్య, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు 18-27ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, DV ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: incometaxgujarat.gov.in
News February 17, 2026
$100 బిలియన్లతో అదానీ ఏఐ డేటా సెంటర్లు

దేశంలో పర్యావరణహిత AI డేటా సెంటర్ల నిర్మాణానికి 100 బిలియన్ డాలర్లను వెచ్చించనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. 2035లోగా నేరుగా $100బిలియన్లు, సంబంధిత రంగాల కోసం మరో $150 బిలియన్లు వెచ్చించనుంది. సర్వర్ మాన్యుఫ్యాక్చరింగ్, సావరిన్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్, సెమీకండక్టర్స్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తంగా ఈ పెట్టుబడుల ద్వారా పదేళ్లలో $250 బిలియన్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ కాబోతోంది.


