News March 28, 2025
చాకిచర్ల సచివాలయం వ్యవహారంపై ఆరా తీసిన కలెక్టర్..

మండలంలోని చాకిచర్ల సచివాలయం వివాదాస్పద వ్యవహారంపై జిల్లా కలెక్టర్ నివేదిక కోరినట్లు MPDOవిజయ తెలిపారు. మంగళవారం రాత్రి ఓ ప్రైవేట్ వ్యక్తి సచివాలయం తాళం తీసి లోపలికి వెళ్ళడం.. దానిని పసిగట్టిన స్థానికులు ఆ వ్యక్తిని నిలదీసిన వైనం గురించి way2news లో ‘తాళం ఎందుకు తీశారు’.? అంటూ కథనం వచ్చిన సంగతి తెలిసిందే. సంచలనం రేపిన ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక పంపుతున్నట్లుMPDO చెప్పారు
Similar News
News March 30, 2025
రేపు పోలీస్ ప్రజా ఫిర్యాదు పరిష్కార వేదిక రద్దు

ప్రతి సోమవారం జరిగే పోలీసు ప్రజా ఫిర్యాదు పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. మరల వచ్చే సోమవారం యధావిధిగా ఈ ప్రజా ఫిర్యాదు పరిష్కార కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
News March 30, 2025
64 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: జేసీ కార్తీక్

నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 64 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ తెలిపారు. శనివారం 6,893 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జేసీ చెప్పారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ 24 గంటల నుంచి 48 గంటల్లోగా రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేస్తున్నట్లు ఆయన తెలిపారు
News March 29, 2025
నెల్లూరు కలెక్టరేట్లో ఉగాది వేడుకలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈ నెల 30వ తేది ఆదివారం ఉదయం 9:00 గంటలకు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వేడుకల్లో అందరూ పాల్గొనాలన్నారు. అధికారులందరూ తెలుగు సాంప్రదాయ దుస్తులతో హాజరై ఉగాది వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.