News March 20, 2025

చాగలమర్రిలో రాష్ట్రంలోనే అత్యధికం..!

image

నంద్యాల జిల్లాలో గత కొద్దిరోజులుగా భానుడు విలయ తాండవం ఆడుతున్నాడు. ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం బుధవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 42.3°C ఉష్ణోగ్రత నమోదవడం ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మార్చిలోనే 42.3°C ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం.

Similar News

News March 20, 2025

భార్య పోర్న్ చూస్తోందని విడాకులివ్వడం కుదరదు: హైకోర్టు

image

భార్య పోర్న్ చూస్తోందనో లేక స్వయంతృప్తిని పొందుతోందనో భర్త విడాకులు ఇవ్వడం కుదరదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తనతో పాటు కలిసి చూడాలంటూ భర్తను ఆమె బలవంతపెట్టనంత వరకూ అది వైవాహిక క్రూరత్వం కిందకు రాదని తేల్చిచెప్పింది. భార్య పోర్న్ చూస్తూ స్వయంతృప్తిని పొందుతోందని, ఆమె నుంచి తనకు విడాకులిప్పించాలని కోరుతూ ఓ భర్త వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.

News March 20, 2025

అసెంబ్లీ నిరవధిక వాయిదా

image

AP: రాష్ట్ర శాసనసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. మొత్తం 15 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. గత నెల 24 నుంచి నేటి వరకు సమావేశాలు కొనసాగాయి. 85 గంటల 55 నిమిషాల పాటు సభ కొనసాగింది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు కూటమి సర్కార్ ఆమోదం పలికింది. అలాగే 9 బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

News March 20, 2025

ఏప్రిల్ తొలివారంలో ‘ది రాజాసాబ్’ టీజర్?

image

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న ‘ది రాజాసాబ్’ సినిమా టీజర్‌‌పై నెట్టింట చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు వార్తలు రాగా, టీజర్‌తో దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ తొలివారంలోనే టీజర్ విడుదల చేయాలని భావిస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. కాగా, ‘ది రాజాసాబ్’ చిత్రీకరణ ఇంకా పూర్తికాలేదని వెల్లడించాయి.

error: Content is protected !!