News December 24, 2025
చింతపల్లిపేటలో విషాదం.. తల్లి అంత్యక్రియలకు వచ్చి కూతురు మృతి

గుర్ల మండలం చింతపల్లిపేట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే రోజు తల్లి, కూతురు మృతి చెందడంతో గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. అప్పలనరసమ్మ (60) అనారోగ్యంతో సోమవారం మృతి చెందింది. తల్లిని చివరిచూపు చూసుకునేందుకు వచ్చిన కూతురు గౌరీ(38) ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది.
Similar News
News December 31, 2025
VKB: 102 మందిపై కేసులు నమోదు

రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 102 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ స్నేహ మెహ్రా పేర్కొన్నారు. పాత నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 185 మందిని ఫింగర్ ప్రింట్ డివైజ్ ద్వారా తనిఖీ చేసి వారి పూర్వపరాలను పరిశీలించినట్లు వివరించారు.
News December 31, 2025
న్యూ ఇయర్.. 72 వాహనాలు సీజ్: VKB SP

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ముందస్తు తనిఖీల్లో భాగంగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,895 వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు చెప్పారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేకుండా, నంబర్ ప్లేట్లు సక్రమంగా లేని 72 వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు.
News December 31, 2025
చిత్తూరు: పెన్షనర్లకు గమనిక

చిత్తూరు జిల్లాలోని పెన్షనర్లు కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలని ట్రెజరీశాఖ DD రామచంద్ర సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ విరమణ పొందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబ పెన్షన్దారులు వార్షిక జీవన ప్రమాణ ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలన్నారు. జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి 28వ తేదీ లోపు లైఫ్ సర్టిఫికెట్లను ఇవ్వాలని.. గడువులోపు సమర్పించకపోతే మార్చి నెల పింఛన్ నిలిపివేస్తామని స్పష్టం చేశారు.


