News May 1, 2024

చింతపల్లిలో రూ.5.5కోట్ల లిక్విడ్ గంజాయి స్వాధీనం

image

చింతపల్లి మండలం అన్నవరం సమీపంలో 52 కేజీలు గంజాయి లిక్విడ్‌ను స్వాధీనం చేసుకొని, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు చింతపల్లి ఏఎస్పీ ప్రశాంత్ శివ కిషోర్ బుధవారం తెలిపారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని తయారవుతున్న రవాణాకు సిద్ధంగా ఉన్న లిక్విడ్ గంజాయిని, తయారు చేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. దీని విలువ సుమారు రూ.5.5 కోట్లు ఉంటుందని, వేరే రాష్ట్రాలలో విలువ మరింత ఎక్కువ ఉంటుందన్నారు.

Similar News

News July 6, 2025

విశాఖలో భక్తి శ్రద్ధలతో మొహరం

image

విశాఖలో మొహరం వేడుకలకు ఆదివారం సాయంత్రం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చెంగలరావుపేటలోని హుసేని మసీదు ఆధ్వర్యంలో షియా ముస్లింలు హజరత్ ఇమామ్ హుస్సేన్ మరణానికి సానుభూతిగా రక్తం చిందించారు. ఈ కార్యక్రమంలో షియా ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

News July 6, 2025

గిరి ప్రదక్షిణ: పార్కింగ్ ప్రదేశాలివే-2

image

➣అడవివరం నుంచి గిరిప్రదక్షిణ నిమిత్తం తొలిపావంచకు వచ్చే వారు వాహనాలను అడవివరం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో పెట్టి కాలినడకన రావి చెట్టు జంక్షన్ నుంచి గాంధీనగర్, కోనేరు మీదుగా కలశం జంక్షన్ చేరుకోవాలి
➣ వేపగుంట, గోపాలపట్నం నుంచి వచ్చే భక్తులు సింహపురి కాలనీ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలైన RTC స్థలం, GVMC పార్క్, VMRDA స్థలాల్లో వాహనాలు నిలపాలి.

News July 6, 2025

విశాఖలో రేపు P.G.R.S.

image

విశాఖలో కలెక్టరేట్, జీవీఎంసీ, సీపీ ఆఫీసుల్లో సోమవారం P.G.R.S. నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఉదయం 9.30కు‌ P.G.R.S. ప్రారంభమవుతుందని కలెక్టర్ వెల్లడించారు. జీవీఎంసీ ఆఫీసులో మేయర్, కమిషనర్ ఆధ్వర్యంలో ఫిర్యాదు స్వీకరించనున్నారు. పోలీస్ కమిషనర్ ఆఫీసులో సీపీ ప్రజల నుంచి వినతులు అందుకోనున్నారు. కాల్ సెంటర్ 1100ను సంప్రదించి కూడా ప్రజలు వినతులను నమోదు చేసుకోవచ్చు.