News September 12, 2025

చింతపల్లి: అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు 15న స్పాట్ కౌన్సెలింగ్

image

ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం పరిధిలోని అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు 15న స్పాట్ కౌన్సెలింగ్ జరగనుందని చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ అప్పలస్వామి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న, చేయించుకోని విద్యార్థులు సైతం గుంటూరు లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో జరిగే స్పాట్ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చన్నారు.

Similar News

News September 12, 2025

MOSతో క్లరికల్ ఉద్యోగాలు

image

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో క్లరికల్ కేడర్‌లో ఉద్యోగాలు పొందేందుకు ఉపయోగపడే కోర్సు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్ట్(MOS). దీని ద్వారా వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ తదితర బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ లభిస్తాయి. దీంతో SSC నిర్వహించే CHSL, MTS రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో విజయం సాధించవచ్చు. పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సును ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అందిస్తున్నాయి.

News September 12, 2025

సంతానం పొందడానికి SMEP..

image

ప్రస్తుత కాలంలో చాలా జంటలు సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అయితే పిల్లలు పుట్టకపోవడానికి లోపాలే కారణం అనుకుంటారు. కానీ అండం విడుదల సమయాన్ని గుర్తించలేకపోవడం కూడా ఒక కారణం. ఓవులేషన్ టెస్ట్ చేసుకొని దాన్ని బట్టి కలయికలో పాల్గొంటే సక్సెస్‌ రేటు పెరుగుతుందంటున్నారు నిపుణులు. దీన్నే స్పెర్మ్‌ మీట్‌ ఎగ్‌ ప్లాన్‌(SMEP) అంటారు. దీనికి అనుగుణంగా శృంగారంలో పాల్గొనడం వల్ల గర్భం ధరించే అవకాశాలు పెరుగుతాయి.

News September 12, 2025

డయేరియాతో ఎవరూ మరణించలేదు: మంత్రి సత్యకుమార్

image

AP: విజయవాడలో ఇప్పటివరకు 141 డయేరియా కేసులు నమోదైనట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ వ్యాధితో నగరంలో ఎవరూ మరణించలేదని ఆయన చెప్పారు. న్యూరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులను మంత్రి నారాయణ, MP చిన్నితో కలిసి ఆయన పరామర్శించారు. ‘ఇంటింటి సర్వే చేసి ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. బుడమేరు ప్రాంతంలోని భూగర్భజలాలు కలుషితం అయ్యాయేమోనన్న అనుమానం ఉంది’ అని వ్యాఖ్యానించారు.