News March 22, 2024

చింతపల్లి: అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

image

చింతపల్లి మండలంలోని లంబసింగి ఘాట్ రోడ్డులో గురువారం అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దారకొండ నుంచి నర్సీపట్నం వైపుకు వెళుతున్న ఓ లారీ లంబసింగి ఘాట్‌లో తులబాడగెడ్డ సమీపంలోకి వచ్చేసరికి బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. గాయాల పాలైన క్లీనర్‌ను డౌనూరు పీహెచ్‌సీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 20, 2026

ఏయూ గేటు వద్ద ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన

image

ఆంధ్రా యూనివర్సిటీలో ఏబీవీపీ కార్యకర్తలపై దాడి చేసిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేస్తూ యూనివర్సిటీ గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు. వందేమాతరం పాడడం తప్పా.. భారతమాతకు జై అనడం తప్పా.. అంటూ ఏబీవీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. వీసీకి ఫిర్యాదు చేయాలే గానీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని దాడి చేయడం తగదన్నారు. వారిని అరెస్టు చేసే వరకు ఆందోళన విరమించమని పేర్కొన్నారు.

News February 20, 2026

విశాఖలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

image

విశాఖలో ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 85 కేంద్రాల్లో 81,001 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు తాగునీరు, వైద్య శిబిరాలు, అదనపు బస్సుల సౌకర్యం కల్పించాలని ఆమె సూచించారు. పొరపాట్లు జరగకుండా పరీక్షలను విజయవంతం చేయాలని జేసీ స్పష్టం చేశారు.

News February 20, 2026

గ్లోబల్ ఏఐ సెంటర్‌గా వైజాగ్: గూగుల్ సీఈవో

image

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ విశాఖతో తనకున్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. విద్యార్థిగా చెన్నై నుంచి ఐఐటీ-ఖరగ్‌పూర్ వెళ్లేటప్పుడు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ మీదుగా ప్రయాణించేవాడినని, అప్పట్లో అది ఎంతో ప్రశాంతమైన నగరమని గుర్తుచేసుకున్నారు. అలాంటి విశాఖ నేడు గ్లోబల్ ఏఐ (AI) హబ్‌గా మారుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదని పేర్కొన్నారు. ఈ మార్పు అద్భుతమని ఆయన కొనియాడారు.