News April 1, 2024

చింతలపూడి మార్కెట్ వెనుక డెడ్‌బాడీ లభ్యం

image

ఏలూరు జిల్లాలో వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. చింతలపూడి మార్కెట్ యార్డ్ వెనుక రమేశ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. ఆయన మృతి చెంది వారం రోజులు అయినట్లు కుటుంబీకులు అభిప్రాయపడుతున్నారు. రమేశ్ చింతలపూడి జీబీజీ రోడ్‌లో సెలూన్ షాప్ నిర్వహిస్తున్నట్లు బంధువులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 30, 2025

నరసాపురం తీరంలో విషపుటీగల గూడులు

image

నరసాపురం తీర ప్రాంతంలో విషపుటీగల గూడులు దర్శనమిస్తున్నాయి. ఇటీవల నరసాపురం మండలం వేములదీవి వెస్ట్ కాపులకొడప గ్రామంలో భార్యభర్తలపై ఇవి దాడి చేశాయి. 2004 సునామీ తరువాత సముద్రం మీదగా నరసాపురం తీర ప్రాంతానికి వచ్చిన ఈ విషపు ఈగలు పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలో తిష్ట వేశాయి. గతంలో పేరుపాలెం, పెదమైనవానిలంక గ్రామంలో వీటి దాడిలో పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి.

News September 30, 2025

తణుకు: పోలీసులకు సవాలుగా మారిన దొంగతనం కేసు

image

తణుకు వారణాసివారి వీధిలో ఇటీవల సంచలనం రేకెత్తించిన చోరీ వ్యవహారం పోలీసులకు సవాలుగా మారింది. ఒంటరిగా జీవిస్తున్న వృద్ధురాలు వాకలపూడి కనకదుర్గను బెదిరించి 70 కాసులు బంగారు ఆభరణాలు దుండగులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే పొరుగు రాష్ట్రాలకు చెందిన నిందితులు దోపిడీ అనంతరం మహారాష్ట్ర పారిపోయినట్లు సమాచారం. దీంతో బృందాలుగా విడిపోయిన పోలీసు సిబ్బంది వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

News September 30, 2025

ఆకివీడు: జాబ్ పోయింది.. ఈఎంఐలు కట్టలేక సూసైడ్

image

ఆకివీడు శ్రీరాంపురం ప్రాంతానికి చెందిన పాలకుర్తి సంతోశ్ కుమార్(35) ఇంటి వరండాలో మెడకు చీర బిగించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని అమెజాన్‌ కంపెనీలో సంతోశ్ ఉద్యోగం చేసేవాడు. 3 నెలల క్రితం అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈఎంఐలు చెల్లించలేక మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెల్ఫీ సూసైడ్ వీడియోను చనిపోయే ముందు భార్యకు పంపాడు.