News April 8, 2025
చింతూరు: ఈ నెల 10న ప్రజాభిప్రాయ సేకరణ

ఈ నెల 10న చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ మంగళవారం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వల్ల పేజ్ 1bలో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు ఈ కార్యక్రమానికి వచ్చి అభిప్రాయాలు తెలపాలన్నారు. నిర్వాసితులు ఆర్అండ్ఆర్ కాలనీలకు వెళ్లిన తర్వాత జీవనోపాధి, నైపుణ్య శిక్షణకు ఎటువంటి అవకాశాలు కావాలో తెలియజేయాలన్నారు.
Similar News
News January 8, 2026
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి ఘన స్వాగతం

భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్లో ఆయనకు మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురాం రాజు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన బయలుదేరి విశాఖలోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయనను కలిసిన వారిలో పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.
News January 8, 2026
పెద్దపల్లి: ‘రోడ్డు భద్రత.. అందరి బాధ్యత’

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం-2026లో భాగంగా PDPLజిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మంథని, చీకురాయి, హన్మంతరావుపేట పాఠశాలల్లో రోడ్డుభద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. PDPL పట్టణంలో ITI నుంచి భారీ బైక్ ర్యాలీ, సుల్తానాబాద్లో వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో రవాణా శాఖ, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. RTO రంగారావు పాల్గొని రోడ్డుభద్రత నిబంధనలు పాటించాలన్నారు.
News January 8, 2026
ఇతిహాసాలు క్విజ్ – 121 సమాధానం

ఈరోజు ప్రశ్న: ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే గుడ్డివాడు కావడానికి గల కారణం ఏంటి?
సమాధానం: హస్తినాపుర వంశాభివృద్ధి కోసం వ్యాసమహర్షి అంబిక వద్దకు వెళ్లారు. ఆయన తపశ్శక్తితో కూడిన భయంకర రూపాన్ని చూసి అంబిక భయంతో కళ్లు మూసుకుంది. తల్లి చేసిన ఆ చిన్న పొరపాటు వల్ల, ఆమెకు పుట్టిన కుమారుడు ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడయ్యాడు. ఆమె కళ్లు మూసుకోవడమే అతడి దృష్టిలోపానికి ప్రధాన కారణమైంది.
<<-se>>#Ithihasaluquiz<<>>


