News November 19, 2025

చింతూరు: కాలువలో ఈతకు దిగి యువకుడి గల్లంతు

image

మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫోర్ బై కెనాల్‌లో ఈతకు దిగిన ఓ యువకుడు బుధవారం గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి ఎలమంచిలిలోని నారాయణపురం గ్రామానికి చెందిన గనిశెట్టి జగదీశ్వరరావు (25)గా గుర్తించామని ఎస్సై సాధిక్ తెలిపారు. అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ముగ్గురు స్నేహితులు కాలువలోకి దిగగా ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారని చెప్పారు.

Similar News

News November 22, 2025

పార్వతీపురం: ఈ బిల్డింగ్ నిజంగా కొత్తదేనా?

image

పార్వతీపురం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన భూసార పరీక్ష కేంద్రాన్ని మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, గుమ్మిడి సంధ్యారాణితోపాటు MLAలు <<18354280>>ప్రారంభించారు<<>>. అయితే ఆ భవనం గురించి స్థానికంగా చర్చ నడుస్తోంది. అదే భవనానికి ఆనుకుని పక్కన ఉన్న భవనం శిథిలంగా ఉంది. నిన్న ప్రారంభించిన భవనానికి పెయింట్లు వేసినట్లు ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై అధికార యంత్రాంగం స్పందించాల్సి ఉంది.

News November 22, 2025

వెహికల్ చెకింగ్‌లో ఈ పత్రాలు తప్పనిసరి!

image

పోలీసులు వాహనాల తనిఖీ సమయంలో ఏయే పత్రాలను చెక్ చేస్తారో చాలా మందికి తెలిసుండదు. చెకింగ్ సమయంలో మీ వద్ద డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్‌తో పాటు పొల్యూషన్ సర్టిఫికెట్ కూడా ఉండేలా చూసుకోండి. కమర్షియల్ వాహనమైతే పైన పేర్కొన్న వాటితో పాటు పర్మిట్ & ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉండాలి. తెలుగు రాష్ట్రాల వాహనదారులు mParivahan లేదా DigiLocker యాప్‌లలో డిజిటల్ రూపంలో ఉన్న పత్రాలను చూపించవచ్చు. SHARE IT

News November 22, 2025

దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలి: KTR

image

TG: ఈనెల 29న ‘దీక్షా దివస్’ను ఘనంగా నిర్వహించాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పిలుపునిచ్చారు. “15 ఏళ్ల క్రితం, పార్టీ అధినేత KCRగారు ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని దీక్ష చేపట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. జిల్లా కేంద్రాల్లోని పార్టీ ఆఫీసుల్లోనే దీక్షా దివస్‌ను నిర్వహించుకోవాలి. కార్యక్రమం ప్రారంభానికి గుర్తుగా KCR భారీ కటౌట్‌కు పాలాభిషేకం చేయాలి” అని పార్టీ నేతలకు నిర్దేశం చేశారు.