News February 10, 2026
చిట్యాలను ఏలిన వారు వీరే..!

కాకతీయుల కాలంలో గంగయ్య సాహిణి పునాది వేసిన నాటి చిట్టలపురం, నేటి చిట్యాల ఘనమైన రాజకీయ చరిత్రను కలిగి ఉంది. 1958లో పంచాయతీగా ఏర్పడినప్పటి నుంచి యిమ్మడి నర్సయ్య (11 ఏళ్లు), పందిరి లక్ష్మయ్య (21 ఏళ్లు) సుదీర్ఘకాలం పాలించి గ్రామ గతిని మార్చారు. అనంతరం ఇమ్మడి కృష్ణమూర్తి, వేలుపల్లి భిక్షపతి (2000 వరకు సర్పంచులుగా ఉన్నవారు), ఆదిమల్లయ్య, జిట్ట నగేశ్, శ్రీలక్ష్మి సర్పంచ్లుగా సేవలు అందించారు.
Similar News
News April 14, 2026
గ్రాము బంగారానికి ₹11వేల లాభం!

2019 OCT 15న ఇష్యూ అయిన సిరీస్-5 సావరిన్ గోల్డ్ బాండ్ల ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ రేపటి నుంచి చేసుకోవచ్చని RBI ప్రకటించింది. అప్పుడు గ్రాము ధర ₹3,738 ఉంటే ఇప్పుడు ₹15,009కు (₹11,271 లాభం) చేరింది. ఏప్రిల్ 9, 10, 13 తేదీల్లో గోల్డ్ ప్రైస్ యావరేజ్ ఆధారంగా RBI దీనిని డిసైడ్ చేసింది. మొత్తంగా 302% ప్రాఫిట్.. అంటే ₹లక్ష పెట్టిన వారికి ₹4లక్షలు వస్తాయి. ఇది కాక ఏటా ఇచ్చే 2.5% వడ్డీ కూడా యాడ్ అవుతుంది.
News April 14, 2026
తాండూరులో కలగానే ‘కంది బోర్డు’

తాండూరులో కంది బోర్డు కలగానే మిగిలిపోయింది. తాండూరు, పెద్దేముల్, యాలాల్, బషీరాబాద్ మండలాల్లో సుమారు 2 లక్షల ఎకరాల్లో రైతులు కంది పంటను సాగు చేస్తున్నారు. కంది బోర్డును ఏర్పాటు చేస్తే రైతులకు నేరుగా విత్తనాలు, సబ్సిడీలు, మంచి మార్కెట్ ధర లభిస్తుంది. కంది బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. కొంతకాలంగా కంది బోర్డును ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
News April 14, 2026
ఎన్టీఆర్ ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్?

Jr.NTR బర్త్డే సందర్భంగా మే 20న ఆయన సినిమాలకు సంబంధించి రెండు స్పెషల్ అప్డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్తో చేస్తున్న ‘డ్రాగన్’ మూవీ నుంచి టీజర్ వస్తుందని సినీ వర్గాలు తెలిపాయి. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీపై అఫీషియల్ ప్రకటన, స్పెషల్ పోస్టర్ రానున్నట్లు పేర్కొన్నాయి. అదే రోజున ‘దేవర-2’పైనా మేకర్స్ నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


