News February 28, 2025

చిట్యాల: కుటుంబ సమస్యలతో ఉరేసుకొని వ్యక్తి మృతి

image

చిట్యాల మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన సతీశ్ ఉరేసుకొని మృతిచెందారు.  పోలీసుల కథనం ప్రకారం.. సతీశ్ కొంతకాలంగా మద్యానికి బానిసై భార్యతో గొడవ పడుతున్నాడు. దీంతో ఆమె పుట్టింట్లోనే ఉంటోందిజ ఈ క్రమంలో మద్యం తాగి ఉరేసుకొని చనిపోయాడు. భార్య కాపురానికి రావట్లేదని మనస్థాపంతో ఉరేసుకొని చనిపోయాడని మృతుడి తండ్రి కిట్టయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.

Similar News

News February 28, 2025

గుంటూరు: సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రద్దు

image

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న కారణంగా విజయవాడ మీదుగా గుంటూరు- విశాఖపట్నం మధ్య ప్రయాణించే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను దక్షిణ మధ్య రైల్వే 2 రోజుల పాటు రద్దు చేసింది. ఈ మేరకు మార్చి 1,2 తేదీలలో గుంటూరు-విశాఖపట్నం(నం.17239), విశాఖపట్నం-గుంటూరు(నం.17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను మార్చి 2,3 తేదీలలో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

News February 28, 2025

ఆసియాలో సెకండ్ బెస్ట్ టీమ్ పాక్ కాదు అఫ్గానే!

image

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పాతాళానికి పడిపోయింది. ఐసీసీ ఈవెంట్లలో ఆ జట్టు ఆటతీరు దారుణంగా తయారైంది. చివరి మూడు ఐసీసీ ఈవెంట్లలో (2023 వన్డే ప్రపంచకప్ నుంచి) ఎక్కువ విజయాలు సాధించిన ఆసియా జట్లలో భారత్ (20) టాప్‌లో ఉంది. ఆ తర్వాత అఫ్గానిస్థాన్ (10), పాకిస్థాన్ (6), బంగ్లాదేశ్ (5), శ్రీలంక (3) ఉన్నాయి. దీంతో ఇక నుంచి ఆసియాలో సెకండ్ బెస్ట్ జట్టు అఫ్గాన్ అని నెటిజన్లు అభినందిస్తున్నారు.

News February 28, 2025

ADB: చెట్లకు ఆధార్.. స్పందించిన KTR

image

ఇచ్చోడ మండలం ముఖ్రా(కె) మాజీ స‌ర్పంచ్ గాడ్గె మీనాక్షి ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు కొత్త‌బాట వేసిన విషయం తెలిసిందే. ‘డిజిటల్ ట్రీ ఆధార్’తో ప్రతి చెట్టును జియో-ట్యాగ్, క్యూఆర్‌ కోడ్‌లను కేటాయించారు. దీనిపై KTR స్పందించారు. చెట్లు నాటడమే కాకుండా వాటిని కాపాడుకోవటం, చెట్లకు కూడా ఆధార్ కార్డును రూపొందిండం అద్భుతమైన ఆలోచన అని కొనియాడారు. దీనికి ఆద్యురాలైన మీనాక్షికి అభినందనలు తెలిపారు.

error: Content is protected !!