News December 5, 2024
చిట్యాల: మహిళను కొట్టి పుస్తెలతాడు అపహరణ

ఇంట్లోకి ఇద్దరు చొరబడి ఒంటరిగా ఉన్న మహిళ మెడలో నుంచి పుస్తెలతాడును లాక్కెళ్ళిన ఘటన బుధవారం చిట్యాలలో చోటుచేసుకుంది. ఎస్సై ధర్మ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం సమయంలో గుర్తుతెలియని ఇద్దరు ఉరుమడ్ల రోడ్డులో గల చేపూరి ప్రేమలత ఇంట్లోకి ప్రవేశించారు. ఆమెను కొట్టి మెడలో ఉన్న ఐదు తులాల బంగారు పూసలతాడును లాక్కెళ్లారు. అనంతరం వారు వెంట తెచ్చుకున్న ద్విచక్ర వాహనంపై పారిపోయారు.
Similar News
News February 25, 2026
NLG: సెల్లులు స్విచాఫ్.. అజ్ఞాతంలో రైస్ మిల్లర్లు..!

జిల్లాలో కోట్లాది రూపాయల ప్రభుత్వ ధాన్యం కుంభకోణానికి పాల్పడిన మిల్లర్లు పోలీసులకు దొరకకుండా పరారయ్యారు. తమపై కేసులు నమోదు కాబోతున్నాయనే ముందస్తు సమాచారంతో శనివారం నుంచే వారంతా ఫోన్లు స్విచాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంపై ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పందించారు. ప్రభుత్వ ధాన్యాన్ని లూటీ చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, పరారీలో ఉన్న నిందితులను పట్టుకుంటామన్నారు.
News February 25, 2026
నల్గొండ: ఇంటర్ పరీక్షలకు 45 సెంటర్స్

నల్గొండ జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కలెక్టర్ బి.చంద్రశేఖర్ మంగళవారం సమీక్ష నిర్వహించి వివరాలు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 45 కేంద్రాలలో 27,018 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించాలని, విద్యార్థులు సకాలంలో చేరుకోవాలని అధికారులు సూచించారు.
News February 25, 2026
నల్గొండ: ఇంటర్ పరీక్షలకు 45 సెంటర్స్

నల్గొండ జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కలెక్టర్ బి.చంద్రశేఖర్ మంగళవారం సమీక్ష నిర్వహించి వివరాలు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 45 కేంద్రాలలో 27,018 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించాలని, విద్యార్థులు సకాలంలో చేరుకోవాలని అధికారులు సూచించారు.


