News October 31, 2025
చిత్తూరులో ఐదుగురికి ఉరిశిక్ష.. రేరెస్ట్ ఆఫ్ ది రేర్

చిత్తూరులో అనురాధ దంపతుల <<18160618>>హత్య <<>>కేసు ‘రేరెస్ట్ ఆఫ్ ది రేర్’ అంటూ కోర్టు ఐదుగురికి ఉరిశిక్ష వేసింది. ఒకే కేసులో ఐదుగురికి ఉరిశిక్ష వేయడం దేశంలోనే అరుదైన విషయం. గోద్రా రైలు దహన ఘటన కేసులో ట్రయల్ కోర్టు 11 మందికి ఉరి శిక్ష విధించినా.. ఆ తర్వాత యావజ్జీవ శిక్షగా మారింది. ఛత్తీస్గఢ్లో గిరిజన బాలికపై అత్యాచారం, ఇద్దరి హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష పడినా.. అప్పీల్కు వెళ్లడంతో ఇప్పటికీ పెండింగ్లో ఉంది.
Similar News
News November 1, 2025
పంటలకు ఆర్థిక సాయం పెంపు : మంత్రి కొలుసు

పంటలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచామని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. గతంలో ధరల స్థిరీకరణకు రూ.3వేల కోట్లు కేటాయించగా.. తాము రూ.6 వేల కోట్లకు పెంచామన్నారు. మామిడికి రూ.260 కోట్లు, పొగాకు రూ.273 కోట్లు, కోకోకు రూ.14 కోట్లు, కాఫీకి కిలోకు రూ.50 చొప్పున కేటాయించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం 40 లక్షల మెట్రిక్ టన్నులు కొంటె.. తమ ప్రభుత్వం 53.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు.
News November 1, 2025
వరంగల్ కబ్జాలపై సీఎం రేవంత్ ఉక్కుపాదం

వరంగల్ వరదల నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులు, నాళాలపై కబ్జాలు చేసిన వారిని ఎంత పెద్దవారైనా వదలొద్దని హెచ్చరించారు. ఫ్లడ్ మేనేజ్మెంట్లో ఇరిగేషన్ శాఖతో అన్ని విభాగాలు సమన్వయంగా పని చేయాలని ఆదేశించారు. ముంపు ప్రభావిత కుటుంబాలకు సహాయం అందించడంలో నిర్లక్ష్యం వదలాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలని ఆదేశించారు.
News November 1, 2025
IPL: LSG హెడ్ కోచ్గా యువరాజ్ సింగ్?

IPL-2026లో LSG హెడ్ కోచ్గా యువరాజ్ సింగ్ వ్యవహరించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఆ ఫ్రాంఛైజీ ఆయనతో చర్చలు జరిపినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గత సీజన్లో LSG కోచ్గా ఆసీస్ మాజీ ప్లేయర్ జస్టిన్ లాంగర్ పనిచేశారు. పంత్ కెప్టెన్గా ఉన్నారు. ఈ జట్టు పాయింట్స్ టేబుల్లో ఏడో స్థానానికి పరిమితమైంది. కాగా ఇటీవల NZ క్రికెటర్ విలియమ్సన్ను స్ట్రాటజిక్ అడ్వైజర్గా నియమించింది.


