News January 13, 2026
చిత్తూరులో మహిళ మృతి

చిత్తూరులో గుర్తుతెలియని మహిళ మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. పట్టణంలోని పీసీఆర్ సర్కిల్లో 45 నుంచి 50 సంవత్సరాల లోపు వయసున్న మహిళ మృతి చెంది ఉండగా స్థానికులు గుర్తించారు. పోలీసులు విచారించగా రెండు రోజులుగా అదే ప్రాంతంలో ఆమె ఉన్నట్టు, ఆరోగ్యం క్షీణించి మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలిసినవారు 08572 234100 నంబర్ను సంప్రదించాలన్నారు.
Similar News
News January 26, 2026
చిత్తూరు: జెండా వందనం చేసిన కలెక్టర్

చిత్తూరు పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా అధికార యంత్రాంగానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే డా. థామస్, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, జిల్లా అధికార యంత్రాంగం, విద్యార్థులు పాల్గొన్నారు.
News January 26, 2026
చిత్తూరులో పీజీఆర్ఎస్ రద్దు

సోమవారం కలెక్టరేట్, పోలీసు జిల్లా కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రిపబ్లిక్ డేని పురస్కరించుకుని ఆ కార్యక్రమం రద్దు చేసినట్లు వెల్లడించారు. వచ్చేవారం నుంచి యథావిధిగా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రజలు గమనించాలని కోరారు.
News January 25, 2026
చిత్తూరు: గురుకులాలు పిలుస్తున్నాయ్.!

పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు అండగా నిలుస్తున్నాయి. జిల్లాలో బాయ్స్ కోసం రామకుప్పం, పూతలపట్టు, విజిలాపురం, గర్ల్స్ కోసం జీడీనెల్లూరు, చిత్తూరు, పలమనేరు, కుప్పం లో గురుకులాలు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్టియర్లో చేరెందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 19 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.


