News April 29, 2024

చిత్తూరు: ఆ రోజున వేతనంతో సెలవు

image

ఎన్నికల్లో ఓటు వినియోగించుకునేందుకు మే 13వ తేదీ కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, దుకాణాలు, హోటళ్లు ఇతరత్రా వాటిల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సెలవు ప్రకటించాలని స్పష్టం చేశారు. నిబంధనలను పాటించని యాజమాన్యాలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Similar News

News March 2, 2026

చిత్తూరు: పన్ను వసూళ్లకు 15 వరకు గడువు

image

చిత్తూరు జిల్లాలో పంచాయతీల్లో పన్నుల వసూళ్ల గడువును ఈనెల 15 వరకు ఇచ్చినట్లు డీపీవో సుధాకర్ రావు తెలిపారు. ఫిబ్రవరి 28వ తేదీ వరకు జిల్లాలో 75 శాతం వసూళ్లు చేసినట్లు వెల్లడించారు. మొత్తం లక్ష్యం రూ.27.41 కోట్లు కాగా అందులో 75 శాతం అంటే రూ.20.55 కోట్లు రాబట్టామన్నారు. 15వ తేదీలోపు మిగిలిన 25 శాతం పన్నులను వసూలు చేయడానికి కృషి చేస్తామని వివరించారు.

News March 2, 2026

చిత్తూరు: టీచర్లకు గమనిక

image

టీచర్ల సీనియారిటీ జాబితాను టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(టిస్) ఆధారంగా సిద్ధం చేసినట్లు చిత్తూరు డీఈవో రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. డీఈవో, డీవైఈవో, ఎంఈవోల మెయిల్స్‌కు పంపించామని.. అభ్యంతరాలు ఉంటే ఈనెల 10వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయ పనివేళల్లో తెలియజేయాలని సూచించారు. తగిన ఆధారాలతో సంబంధిత ఉప, మండల విద్యాశాఖాధికారులు ధ్రువీకరించిన పత్రాలను అందజేయాలన్నారు.

News March 2, 2026

చిత్తూరు: కరెంట్ సమస్య ఉంటే కాల్ చేయండి!

image

చిత్తూరు జిల్లాలో చాలా మంది లోవోల్టేజ్, ఎక్కువ కరెంట్ ఛార్జీలు, మీటర్ల నూతన కనెక్షన్లు ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటి పరిష్కారానికి ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమం నేడు నిర్వహిస్తున్నామని ఎస్ఈ ఇస్మాయిల్ ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల లోపు 79931 47979 నంబర్‌కు కాల్ చేసి సమస్యలను చెప్పవచ్చు. వాటిని పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకుంటారు.