News October 8, 2024

చిత్తూరు: ఉచిత ఇసుక విధానం అమలు : కలెక్టర్

image

జిల్లాలో పకడ్బందీగా ఉచిత ఇసుక విధానం అమలు జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. సోమవారం సచివాలయంలో కలెక్టర్, ఎస్ పి మణికంఠ చందోలుతో కలిసి ఇసుక విధానంపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తక్కువ ధరకు ఇసుకను ప్రజలకు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. https://sand.ap.gov.in/ ఇసుక కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Similar News

News October 7, 2024

మదనపల్లె: స్వర్ణకుమారిది హత్యే .. పోలీసుల అదుపులో వెంకటేశ్

image

మదనపల్లె జగన్ కాలనీలో గత నెల 9న అదృశ్యమైన స్వర్ణకుమారిని హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితుడు వెంకటేశ్‌ను సోమవారం కర్ణాటకలో పోలీసులు పట్టుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో ఆమెను పథకం ప్రకారం హత్యచేసి, 2టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాతిపెట్టినట్లు తెలుసుకున్నారు. మంగళవారం DSP, MROల సమక్షంలో హత్య కేసు వివరాలు, వెంకటేశ్ అరెస్టు మీడియాకు బహిర్గతం చేయనున్నారు.

News October 7, 2024

తిరుమల శ్రీవారికి చెన్నై గొడుగులు

image

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుంచి తొమ్మిది గొడుగులు, రెండు పెరుమాళ్ నామాలను ఊరేగింపుగా సోమ‌వారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ ఆర్‌.ఆర్‌.గోపాల్‌జి ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టీటీడీ అధికారులు ఈఓ శ్యామల రావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఘన స్వాగతం పలికారు.

News October 7, 2024

తిరుమల: 1264 మందితో బందోబస్తు

image

గరుడ సేవ కోసం మూడు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని.. ఇందుకోసం 1264 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌లో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రోప్ పార్టీలతో భక్తుల రద్దీ నియంత్రించాలన్నారు. భద్రతా తనిఖీలు కొనసాగించాలన్నారు. ఏ చిన్న ఘటనకు ఆస్కారం ఇవ్వరాదన్నారు.