News February 16, 2026
చిత్తూరు: ఉదయాన్నే రోడ్డు ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్

కార్వేటినగరం M) తురక మిట్ట వద్ద సోమవారం కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న దేవకి అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా మిగిలిన ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి, క్షతగాత్రులను CHC ఆసుపత్రికి తరలించారు. సదాశివకోనకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Similar News
News February 21, 2026
నల్గొండలో 24న మినీ జాబ్ మేళా

నల్గొండలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 24న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎన్. పద్మ తెలిపారు. ఐటీఐ క్యాంపస్లోని ఉపాధి కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ఈ మేళా ప్రారంభమవుతుందని తెలిపారు. ఇతర వివరాలకు 7893420435 నంబర్ను సంప్రదించాలని ఆమె కోరారు.
News February 21, 2026
సిరిసిల్ల: రోడ్డు ప్రమాదం.. బోల్తా కొట్టిన ఆటో

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ హనుమాన్ ఆలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముస్తాబాద్ మండలం గూడూరుకు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆటోలో తంగళ్లపల్లి మైనారిటీ పాఠశాలకు వెళ్తుండగా వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థినీలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 21, 2026
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు: కామారెడ్డి SP

కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులను లక్ష్యంగా చేసుకుని కారుతో అతివేగంగా దూసుకెళ్లిన నిందితుడు గిరెడ్డి మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పాత నేర చరిత్ర కలిగిన ఇతడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, విద్వేషాలకు తావులేకుండా మత సామరస్యాన్ని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


