News October 20, 2024

చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ కనబడటం లేదంటూ పోస్టర్లు

image

చిత్తూరు MLC, కుప్పం వైసీపీ ఇన్‌ఛార్జ్ భరత్ కనబడడం లేదంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఎమ్మెల్సీ భరత్ కుప్పం వైపు పెద్దగా కన్నెత్తి చూడడం లేదు. ఈ నేపథ్యంలో ‘MLC భరత్  కనబడడం లేదు. ఆచూకీ తెలిసినవారు మాకు తెలియజేయగలరు. కుప్పం నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలు’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్‌గా మారింది.

Similar News

News November 12, 2025

కాణిపాక ఆలయానికి రూ.1.06 కోట్ల ఆదాయం

image

కాణిపాకంలో ఆన్‌లైన్, సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలాలు బుధవారం నిర్వహించారు. ఈక్రమంలో దేవస్థానానికి మొత్తం రూ.1,06,99,997 ఆదాయం లభించింది. షాపింగ్ కాంప్లెక్స్, హోటల్ లైసెన్స్ హక్కు రూ.54.63 లక్షలు, పాదరక్షల భద్రపరుచుకునే హక్కు రూ.24.56 లక్షలు, వినాయక సదన్ హోటల్ లైసెన్స్ హక్కు రూ.27.10 లక్షలు, కళ్యాణమండపం షాపు హక్కు రూ.70 వేలు పలికిందని ఈవో పెంచల కిషోర్ వెల్లడించారు.

News November 12, 2025

చిత్తూరు: టెన్త్ విద్యార్థులకు గమనిక

image

జిల్లాలోని అన్ని యాజమాన్య స్కూళ్లలో పదో తరగతి విద్యార్థులు అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల 25 వరకు అవకాశం కల్పించినట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. రూ.50 అపరాధ రుసుంతో ఈ నెల 26 నుంచి డిసెంబర్ 3 వరకు, రూ.200 రుసుంతో డిసెంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు, రూ.500తో డిసెంబర్ 11 నుంచి 15 వరకు అవకాశం ఉంటుందన్నారు.

News November 12, 2025

చిత్తూరులో ఏక్తా దివస్ ర్యాలీ

image

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని బుధవారం చిత్తూరులో రాష్ట్రీయ ఏక్తా దివస్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు పాల్గొన్నారు. గాంధీ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్దార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మెస్సార్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది.