News March 22, 2025
చిత్తూరు: ఒకరి ప్రాణం కాపాడిన SI

చిత్తూరు జిల్లాలో ఓ ఎస్ఐ ఒకరి ప్రాణం కాపాడారు. యాదమరి మండలం జోడిచింతలకు చెందిన ఓ వ్యక్తి లోన్ తీసివ్వాలని తల్లిని కోరాడు. కొన్ని రోజుల తర్వాత తీసిస్తానని ఆమె చెప్పింది. ‘నేనంటే నీకు ఇష్టం లేదు. నేను చనిపోతున్నా అమ్మ’ అంటూ అతను తల్లికి వీడియో పెట్టి ఫోన్ స్విచాఫ్ చేశాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఈశ్వర్ యాదవ్ టెక్నాలజీ ఉపయోగించారు. మందు తాగి పడిపోయిన వ్యక్తిని హాస్పిటల్కు తరలించి ప్రాణాలు కాపాడారు.
Similar News
News March 22, 2025
చిత్తూరు జిల్లాలో 12 మంది ఎస్ఐల బదిలీ

➤ ఎర్రిస్వామి: వీఆర్ TO చిత్తూరు 1టౌన్
➤ వెంకటరమణ: వీఆర్ TO చిత్తూరు 2 టౌన్
➤ప్రసాద్: చిత్తూరు 2 టౌన్ TO బంగారుపాళ్యం
➤సహదేవి: పెద్దపంజాణి TO పీసీఆర్ చిత్తూరు
➤తులసన్న: వీఆర్ TO సీసీఎస్, చిత్తూరు
➤రామచంద్రయ్య: వీఆర్ TO పెనుమూరు
➤విజయ్ నాయక్: వీఆర్ TO నగరి
➤వెంకటనారాయణ: వీఆర్ TO ఎన్ఆర్ పేట
➤బలరామయ్య: విజయపురం TO డీటీసీ చిత్తూరు
➤వెంకటరమణ: వీఆర్ TO పుంగనూరు
➤ధనంజయరెడ్డి: వీఆర్ TO పెద్దపంజాణి
News March 22, 2025
చిత్తూరులో మెడికల్ షాపుల తనిఖీ

చిత్తూరు నగరంలోని పలు మెడికల్ షాపులను గరుడ బృందం శుక్రవారం తనిఖీ చేసింది. నిషేధిత మందులను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్న దుకాణాలను గుర్తించారు. వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్స్ రద్దుకు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కరీముల్లా షరీఫ్ ప్రతిపాదనలు పంపారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ కీర్తన, లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ ఎస్ఐ అనిల్, వెంకట రవి పాల్గొన్నారు.
News March 21, 2025
పలమనేరు: నూతన అధ్యక్షుడిగా శ్యాం ప్రసాద్ రెడ్డి

పలమనేరు రెవెన్యూ డివిజన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా సోమల తహశీల్దార్ శాంప్రసాద్ రెడ్డి ఎంపికయ్యారు. పలమనేరులో రెవెన్యూ ఉద్యోగుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. డివిజనల్ గౌరవ అధ్యక్షుడిగా మాధవ రాజు, ఉపాధ్యక్షుడిగా యోగానంద్, మోహన్ రెడ్డి, తహసీన, జనరల్ సెక్రటరీగా అనిల్ కుమార్, మరికొందరిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.