News October 30, 2024

చిత్తూరు: ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

image

చిత్తూరు జిల్లాకు సంబంధించి 2025 ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసినట్లు డిఆర్ఓ పుల్లయ్య మంగళవారం తెలిపారు. అభ్యంతరాలపై నవంబర్ 28 వరకు క్లైములు స్వీకరిస్తామన్నారు. డిసెంబర్ 12 లోపు వాటిని పరిష్కరిస్తామన్నారు. జనవరి 6న తుది జాబితా విడుదల అవుతుందన్నారు. జిల్లాలో మొత్తం 15,66,502 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. ఇందులో పురుషులు 7,71,264 మంది, మహిళలు 7,95,165 మంది, ఇతరులు 73 మంది ఉన్నారన్నారు.

Similar News

News February 15, 2026

చిత్తూరు జిల్లాలో రేపు సెలవు.. కానీ!

image

మహా శివరాత్రి సందర్భంగా చిత్తూరు జిల్లాలోని స్కూళ్లకు సోమవారం ఆప్షన్ హాలిడే ఇస్తున్నామని డీఈవో రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. పాఠశాలలకు సెలవు ఉన్నప్పటికీ.. టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని ఆదేశించారు. హెచ్ఎంలు, సబ్జెక్టు టీచర్లు కచ్చితంగా పాఠశాలకు హాజరై టెన్త్ విద్యార్థులకు పరీక్షలు పెట్టాలని సూచించారు.

News February 15, 2026

చిత్తూరు: నేటి చికెన్ ధరలు ఇలా..!

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.122 నుంచి రూ.128, మాంసం రూ.177 నుంచి రూ.195 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.201 నుంచి రూ.220 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ.75గా ఉంది. శివరాత్రి పర్వదినం కావడంతో ఆదివారం అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెప్పారు. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News February 14, 2026

పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం

image

పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో అగస్త్య మహాముని స్వయంగా లింగాన్ని ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ప్రాచీన ఆలయం చోళుల కాలంలో నిర్మించబడి, శైవ సంప్రదాయానికి పేరు పొందింది. ఇక్కడ శివుడు అగస్తీశ్వరునిగా, పార్వతి దేవి మీనాక్షిగా పూజలందుకుంటారు. ఆలయంలోని శివలింగం 6 వేల సంవత్సరాల పురాతమైనదిగా ప్రజల నమ్మకం.