News August 6, 2024
చిత్తూరు: కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు స్థల పరిశీలన

సంతపేట PNC మున్సిపల్ స్కూల్ క్రీడా మైదానంలో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఏర్పాటుకు డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ త్రిసభ్య కమిటీ, MEO సెల్వరాజ్ తో కలిసి స్థల పరిశీలన చేశారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చొరవతో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కమిటీ సభ్యులు ఆర్డీవో చిన్నయ్య మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణుడు, తహశీల్దార్ కళావతి, హైస్కూల్ హెచ్ఎం వేద కుమారి పాల్గొన్నారు.
Similar News
News May 8, 2025
మంత్రి లోకేశ్తో ఎమ్మెల్యే థామస్ భేటీ

తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం శ్రీ సిటీకి చేరుకున్న మంత్రి లోకేశ్ను GDనెల్లూరు ఎమ్మెల్యే థామస్ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని థామస్, మంత్రిని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు.
News May 7, 2025
28న చిత్తూరులో జాబ్ మేళా

చిత్తూరు జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ పద్మజ తెలిపారు. వివిధ ప్రముఖ కంపెనీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. 19 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అర్హులు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు ఉపాధి కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు.
News May 7, 2025
సీఎంను కలిసిన రామకుప్పం టీడీపీ నాయకులు

ఇటీవల జరిగిన రామకుప్పం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుపొందిన సులోచన గుర్రప్ప, వెంకట్రామయ్య గౌడు శనివారం సీఎం చంద్రబాబును కలిశారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సీఎంను కలిశారు. తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రామకుప్పం మండలాభివృద్ధికి సంబంధించి పలు విషయాలను వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.