News March 24, 2024
చిత్తూరు : కేంద్ర బలగాల కవాతు ప్రదర్శన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711206964675-normal-WIFI.webp)
చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలో కేంద్ర బలగాల కవాతు ప్రదర్శన నిర్వహించారు. వన్ టౌన్ సీఐ విశ్వనాథ్ రెడ్డి, ఎస్సై షేక్షావల్లి, టూ టౌన్ సిఐ ఉలసయ్య , ఎస్సై ప్రసాద్ పోలీసు సిబ్బంది నగరంలోని పలు ప్రధాన క్రీడలలో కవాతు నిర్వహించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల్లో గొడవలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News July 18, 2024
చిత్తూరు: విద్యుత్ పోల్స్ మార్చండి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1721259315590-normal-WIFI.webp)
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు స్తంభాలను తక్షణమే మార్పు చేయాలని ఎస్ఈ సురేంద్రనాయుడు ఇంజినీర్లను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల వర్షాల కురుస్తున్నాయని.. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. వినియోగదారులు సైతం ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
News July 18, 2024
తిరుపతి: PGలో ప్రవేశాలకు గడువు పొడిగింపు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1721273133160-normal-WIFI.webp)
తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో M.Sc బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ మేరకు యూనివర్సిటీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. GAT-B 2023 ప్రవేశ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. అర్హత, ఇతర వివరాలకు వెబ్సైట్ చూడాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జులై 20.
News July 18, 2024
అమిత్షా ఆదేశాలు.. పుంగనూరులో విచారణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1721264138406-normal-WIFI.webp)
తనకు స్కాలర్షిప్ రాకుండా అడ్డుకున్నారని ఓ యువతి కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసింది. పుంగనూరు పట్టణానికి చెందిన ఉష SVUలో MSC చదువుతున్నారు. ఏటా కేంద్ర ప్రభుత్వం అందించే లక్ష రూపాయల ఉపకారవేతనానికి అర్హత సాధించారు. ఆమెకు విద్యా దీవెన వస్తుండటంతో వర్సిటీ అధికారులు స్కాలర్షిప్ ఇవ్వలేదు. సదరు యువతి అమిత్షాకు ఫిర్యాదు చేయగా.. ఆయన ఆదేశాలతో పోలీసులు విచారణ చేస్తున్నారు.