News August 13, 2024
చిత్తూరు జిల్లాలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసేది ఇక్కడే
ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. 16 నుంచి ఇవి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్న క్యాంటీన్లను ఈ పట్టణాల్లో ఏర్పాటు చేయనున్నారు.
*కుప్పం : రాధాకృష్ణ రోడ్డు
*పలమనేరు : Beside Anna canteen
*పుంగనూరు : పంచాయతీ రాజ్ ఆఫీస్
*మదనపల్లె : అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్
: Weekly Market
Similar News
News September 30, 2024
సబ్ కలెక్టర్ రేట్ ఫైళ్ల దగ్ధం కేసులో రికార్డులు తీసుకెళ్లిన సిఐడి
మదనపల్లె సబ్ కలెక్టర్ రేట్ లో ఫైళ్ల దగ్ధం అనంతరం సీజ్ చేసిన రికార్థులను ఆదివారం ప్రత్యేకవాహనంలో తిరుపతి సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లారు. శనివారం మదనపల్లెకు వచ్చిన సిఐడి డిఎస్పీ వేణుగోపాల్ రెండు రోజులపాటు స్థానిక డిఎస్పీ కార్యాలయంలో కేసులోని కొందరిని విచారించారు. అనంతరం అప్పట్లో కేసుకు సంబంధించి సీజ్ చేసిన రికార్డులు అన్నింటినీ స్వాధీనంచేసుకుని తీసుకెళ్లడంతో ఫైల్ దగ్ధం కేసు మరుగున పడిందనట్లయింది.
News September 30, 2024
మదనపల్లెలో టమాటా కిలో రూ. 60
మదనపల్లెలో టమాటా KG రూ.60 పలికింది. దిగుబడి తక్కువగా ఉండటంతో వ్యవసాయ మార్కెట్లో ధరలు పైపైకి పెరుగుతున్నాయి. ఆదివారం అత్యధికంగా కిలో ధర రూ.50 నుంచి రూ.60 వరకు పలికింది. 25 కిలోల క్రేట్ ధర రూ.1,500వరకు పలికిందని అధికారులు పేర్కొన్నారు. బయటరాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలతో పంటలేకపోవడంతో ఇక్కడి టమాటాకు డిమాండ్ పెరిగింది. వారంరోజులుగా కిలో రూ.44నుంచి రూ.50 వరకు పలకగా ఆదివారం రూ.60 చేరింది.
News September 30, 2024
పోలీస్ క్వార్టర్స్ స్థలం ఆక్రమించి కట్టిన ఇళ్లు కూల్చి వేత
మొలకలచెరువులో పోలీస్ క్వార్టర్స్ స్థలం ఆక్రమించి అక్రమంగా కట్టిన ఇళ్లను ఆదివారం కూల్చి వేశారు. సీఐ రాజారమేష్ కథనం.. ములకలచెరువు పోలీస్ క్వార్టర్స్కు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో స్థానికంగా ఉన్న కొందరు అక్రమంగా కబ్జా చేసి ఇళ్లను నిర్మించారు. రెండు రోజుల క్రితం జిల్లా అధికారుల ఆదేశాలతో రెవెన్యూ సిబ్బంది పోలీస్ క్వార్టర్స్ స్థలంలో సర్వే నిర్వహించి ఆక్రమణలపై నోటీసులు జారీచేసి కట్టడాలు కూల్చేశారు.