News September 1, 2025

చిత్తూరు జిల్లాలో నేటి నుంచి రేషన్ పంపిణీ

image

జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి రేషన్ పంపిణీ చేయనున్నట్లు డీఎస్ఓ శంకరన్ తెలిపారు. మొత్తం 1,339 చౌక దుకాణాల పరిధిలోని 5.40 లక్షల కార్డుదారులకు బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పు అందించనున్నారన్నారు. ఇందుకుగాను జిల్లాకు 8 వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 3 వేల మెట్రిక్ టన్నుల చక్కెర వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 4, 2025

KPM: నీళ్లు ఆగిపోయాని ప్రచారం.. కేసు నమోదు

image

హంద్రీనీవా కాలువలో నీళ్లు రావడం లేదని ప్రచారాలు చేసిన వారిపై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాలతో పాటు X వేదికగా పోస్టులు పెట్టిన వారిని గుర్తించినట్లు కుప్పం అర్బన్ సీఐ శంకరయ్య వెల్లడించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని తప్పుడు కథనాలు, పోస్టులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News September 4, 2025

చిత్తూరు RWS ఎస్ఈగా ప్రసన్న కుమార్

image

చిత్తూరు జిల్లా గ్రామీణ నీటి సరఫరా(RWS) శాఖ ఎస్ఈగా ప్రసన్నకుమార్ బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఈఈగా పనిచేస్తున్న ఆయనకు ఎస్ఈగా ప్రమోషన్ వచ్చింది. బదిలీపై చిత్తూరుకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు కృషి చేస్తానన్నారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్‌ను ఆయన కలిశారు.

News September 4, 2025

చిత్తూరు జిల్లాకు నిధుల మంజూరు

image

చిత్తూరు జిల్లాలో 697 పంచాయతీలకు గాను 667కు నిధులు వచ్చాయి. 16వ ఆర్థిక సంఘం కింద కేంద్రం రూ.29.78 కోట్లు రిలీజ్ చేసింది. రికార్డులు పూర్తి చేయకపోవడంతో 17 పంచాయతీలు, ఎన్నికలు జరగకపోవడంతో మరో 13 పంచాయతీలకు నిధులు రాలేదు. టైడ్ నిధులను పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉంటుంది. అన్‌లైడ్ నిధులను వీధి లైట్లు, శ్మశానాల అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణాలకు ఖర్చు చేస్తారు.