News September 3, 2025

చిత్తూరు జిల్లాలో ముగ్గురికి రాష్ట్రస్థాయి అవార్డులు

image

చిత్తూరు జిల్లాలో ముగ్గురు టీచర్లకు రాష్ట్రస్థాయి అవార్డులు లభించాయి. నరహరిపేట జడ్పీ టీచర్ ఫిజిక్స్ టీచర్ నౌషద్ అలీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన 30 ఏళ్లుగా విద్యా రంగంలో సేవలు అందించారు. ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ సైతం రూపొందించారు. పుంగనూరు మండలం రాంనగర్ స్కూల్ టీచర్ హేమలత, నక్కబండ కేజీబీవీ టీచర్ నౌజియా సైతం రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్ అవార్డులకు ఎంపికయ్యారు. వారికి పలువురు అభినందనలు తెలిపారు.

Similar News

News September 4, 2025

చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష

image

ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుపడ్డ నిందితుడికి తిరుపతి రెడ్ శాండిల్ స్పెషల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. 2018 జూన్ లో వెదురుకుప్పం మండలం పచ్చికాపలం- తిరుపతి రోడ్డులో వాహనాల తనిఖీ సమయంలో సత్యవేడు మండలానికి చెందిన మహేంద్ర పట్టుపడ్డాడు. నేరం రుజువు కావడంతో గురువారం శిక్ష విధించారు.

News September 4, 2025

KPM: నీళ్లు ఆగిపోయాని ప్రచారం.. కేసు నమోదు

image

హంద్రీనీవా కాలువలో నీళ్లు రావడం లేదని ప్రచారాలు చేసిన వారిపై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాలతో పాటు X వేదికగా పోస్టులు పెట్టిన వారిని గుర్తించినట్లు కుప్పం అర్బన్ సీఐ శంకరయ్య వెల్లడించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని తప్పుడు కథనాలు, పోస్టులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News September 4, 2025

చిత్తూరు RWS ఎస్ఈగా ప్రసన్న కుమార్

image

చిత్తూరు జిల్లా గ్రామీణ నీటి సరఫరా(RWS) శాఖ ఎస్ఈగా ప్రసన్నకుమార్ బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఈఈగా పనిచేస్తున్న ఆయనకు ఎస్ఈగా ప్రమోషన్ వచ్చింది. బదిలీపై చిత్తూరుకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు కృషి చేస్తానన్నారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్‌ను ఆయన కలిశారు.