News September 10, 2025

చిత్తూరు జిల్లాలో యూరియా కొరత లేదు: JD

image

జిల్లాలో యూరియా కొరత లేదని రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ అన్నారు. ఇప్పటివరకు 12,500 టన్నుల యూరియాను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇంకా వెయ్యి టన్నుల యూరియా అందుబాటులో ఉందని, 2,500 టన్నుల యూరియా కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. భూసారాన్ని బట్టి యూరియాను వాడాలని, అధికంగా వాడితే భూమి సారాన్ని కోల్పోతుందని, పంటలో నాణ్యత దిగుబడి తగ్గుతుందని సూచించారు.

Similar News

News September 10, 2025

చిత్తూరు డీసీసీబీ అవినీతి గుట్టురట్టు

image

చిత్తూరు డీసీసీబీలో జరిగిన అవినీతి గుట్టు రట్టయింది. గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల ఆర్థిక విధ్వంసం జరిగిందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఆర్ఓ మోహన్ కుమార్ విచారణ జరిపి నివేదిక కలెక్టర్ సుమిత్ కుమార్‌కు అందజేయగా చర్యలు తీసుకోవాలని డీసీఓను కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. గత పాలకమండలితోపాటు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన పలువురు ఉద్యోగులపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

News September 10, 2025

మ్యారేజ్ బ్యూరో అంటూ ప్రొఫెసర్ కూతురికి వల

image

సైబర్ నేరగాడి వలకు చిక్కి ఓ ప్రొఫెసర్ కూతురు రూ.90 వేలు మోసపోయిన ఘటన తిరుపతిలో చోటు చేసుకున్నట్లు రూరల్ CI చిన్నగోవిందు తెలిపారు. ఆయన వివరాలు మేరకు.. మ్యారేజ్ బ్యూరో ద్వారా సంజయ్ అనే పేరుతో ఉన్న వ్యక్తి వెటర్నటీ వర్సిటీలో పని చేస్తున్న ప్రొ. కూతురికి దగ్గర అయ్యాడు. ఆమెను నమ్మించి రూ.90 వేలు ఫోన్ పే చేయించుకున్నాడు. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో మోసపోయానని గ్రహించిన ఆమె PSలో ఫిర్యాదు చేసింది.

News September 10, 2025

చిత్తూరు DFO భరణి బదిలీ

image

చిత్తూరు జిల్లా ఫారెస్టు అధికారి (DFO)గా సుబ్బరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ప్రస్తుతం కోడూరు సబ్ డీఎఫ్వోగా పని చేస్తున్నారు. ఇప్పటి వరకు చిత్తూరు డీఎఫ్ఓగా ఉన్న భరణిని స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లానింగ్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.