News June 18, 2024
చిత్తూరు జిల్లాలో 64 శాతం మంది పాస్

ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లమెంటరీ ఫలితాల్లో చిత్తూరు జిల్లా విద్యార్థులు పర్వాలేదనిపించారు. జిల్లాలో 4,742 మంది పరీక్షలు రాయగా 3,043 మంది పాసయ్యారు. 64 శాతం ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది. తిరుపతి జిల్లా 6,023 మందికి 3,602 మందే పాస్(60%) అవడంతో 13వ స్థానాన్ని పొందింది. ఒకేషన్లో చిత్తూరు విద్యార్థులు 750 మందికి 380 మంది.. తిరుపతి జిల్లా విద్యార్థులు 380 మందికి 235 మంది పాసయ్యారు.
Similar News
News April 4, 2026
PHC సేవల్లో చిత్తూరు జిల్లాకు చివరి స్థానం

2026 ఫిబ్రవరిలో PHC పనితీరుకు ప్రభుత్వం ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్లో చిత్తూరు జిల్లాకు 28వ స్థానం వచ్చింది. జిల్లాలో 42 PHCలు ఉండగా A గ్రేడ్లో-0, B గ్రేడ్లో 3, C గ్రేడ్లో 23, D గ్రేడ్లో 15 సాధించాయి. అయితే రాష్ట్రంలోనే ఆరోగ్య సేవల్లో చిత్తూరు జిల్లా చివరి స్థానంలో ఉంది. OP, IP సేవలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న PHCల రికార్డుల ఆధారంగా ర్యాంకులు కేటాయించినట్లు తెలుస్తోంది.
News April 3, 2026
చిత్తూరు: గ్యాస్.. ఈ నంబర్కు కాల్ చేయండి!

గ్యాస్ సిలిండర్ల సమస్య పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసినట్టు చిత్తూరు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. ఇప్పటివరకు 50 సమస్యలపై ఫిర్యాదులు రాగా.. ఏజెన్సీలతో చర్చించి 46 సమస్యలు పరిష్కరించామని చెప్పారు. గ్యాస్ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ 08572-242734కు కాల్ చేయాలని సూచించారు. గుడిపాలలో గ్యాస్ ఏజెన్సీకి షోకాజ్ నోటీసు జారీ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామన్నారు.
News April 3, 2026
చిత్తూరు జిల్లాలో స్పెషల్ ఆఫీసర్ల నియామకం

సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమిస్తూ చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 27 మండలాల్లో 621 పంచాయతీలు ఉన్నాయి. వీటికి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, వ్యవసాయాధికారులు, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్, జలవనరులు శాఖ ఏఈలు, డిప్యూటీ డీఈఈలు, ఎఫ్ఎవోలు, పశు, ఉద్యానశాఖ అధికారులు స్పెషల్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు.


