News December 25, 2025
చిత్తూరు జిల్లాలో 94.12% పల్స్ పోలియో వ్యాక్సిన్ పూర్తి

చిత్తూరు జిల్లాలో 94.12% పల్స్ పోలియో పూర్తి చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 2,22,502 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆదివారం, సోమ, మంగళవారాల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేశారు. మంగళవారం ఈ కార్యక్రమం పూర్తవ్వగా జిల్లా వ్యాప్తంగా 2,08,470 మందికి పోలియో చుక్కలు వేశారు.
Similar News
News December 27, 2025
పక్కా గృహాల నిర్మాణంలో చిత్తూరు జిల్లా టాప్.!

పక్కా గృహాల నిర్మాణంలో చిత్తూరు జిల్లా 77%తో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. జిల్లాలో 72,767 గృహాలు మంజూరవ్వగా ఇప్పటి వరకు 53,466 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. ఇందుకుగాను ప్రభుత్వం రూ.1,350 కోట్ల బడ్జెట్ కేటాయించగా, ఇప్పటికే రూ.1,033 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా 3,387 ఇళ్లు ప్రారంభం కాలేదు. 739 ఇళ్లు పునాది దశలో, 9,642 గోడల దశలో, 46 పైకప్పు, గోడల దశలో ఉండగా, 1,549 ఇళ్లకు పైకప్పు పూర్తయ్యింది.
News December 27, 2025
కుప్పంలో మహిళను బలవంతంగా లాక్కెళ్లి.. అత్యాచారం.!

కుప్పం మండలంలో ఓ వివాహితపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు.. ఓ గ్రామానికి చెందిన మహిళ(22) మేకల కొట్టంలో ఉండగా ముగ్గురు యువకులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు. వారిలో ఓ యువకుడు అత్యాచారం చేశాడు. దీనిపై బాధిత మహిళ కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన 17వ తేదీ జరగ్గా 9 రోజుల తర్వాత బాధితురాలు ఫిర్యాదు చేయడంపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
News December 27, 2025
చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడి మృతి

ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలో జరిగింది. తిరుపతి-బెంగళూరు హైవేపై వెళ్తున్న కారు కె.పట్నం బ్రిడ్జి వద్ద గురువారం సాయంత్రం లారీని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఈక్రమంలో అదుపు తప్పి లారీని వెనుక వైపు నుంచి కారు ఢీకొట్టింది. కారులో ఉన్న కోమల(40), ఆమె కుమారుడు వర్ధన్ గౌడ్(11) తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించగా చనిపోయారు. మృతదేహాలను శుక్రవారం బంధువులకు అప్పగించారు.


