News June 12, 2024
చిత్తూరు జిల్లా నేతలకు నిరాశే
నూతన మంత్రివర్గంలో చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు మాత్రమే సీఎం హోదాలో ప్రాతినిధ్యం వహించనున్నారు. మిగిలిన ఎవరికీ మంత్రి పదవులు దక్కలేదు. సీనియర్ కోటాలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఎస్సీ కోటాలో జీడీనెల్లూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు థామస్, మురళి మోహన్ పేర్లు వినిపించాయి. అలాగే పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ పేరు తెరపైకి వచ్చినా.. ఎవరికీ పదవులు ఇవ్వలేదు.
Similar News
News October 1, 2024
వెదురుకుప్పం: బొమ్మయపల్లి సర్పంచ్ చెక్ పవర్ రద్దు
వెదురుకుప్పం మండలంలోని బొమ్మయ్యపల్లి సర్పంచి గోవిందయ్య చెక్ పవర్ రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ నిధులు దుర్వినియోగం అయినట్లు దేవళంపేట వార్డు సభ్యుడు పయని డీపీవో, కలెక్టర్కు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి.. నిధులు దుర్వినియోగమైనట్టు నిర్ధారణ కావడంతో చెక్ పవర్ రద్దు చేసినట్టు అందులో పేర్కొన్నారు.
News October 1, 2024
చిత్తూరు: భవిత కేంద్రాల్లో ఖాళీలకు దరఖాస్తులు
భవిత కేంద్రాలలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సమగ్ర శిక్ష ఏపీసి వెంకటరమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బంగారుపాళ్యం, చిత్తూరు, పలమనేరు, పూతలపట్టు, సోమల కేంద్రాలలో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఫిజియోథెరపీ డిగ్రీ పాస్ అయిన వారు అర్హులని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల ఐదులోగా సమగ్ర శిక్ష కార్యాలయంలో దరఖాస్తులను అందించాలన్నారు.
News October 1, 2024
తెలంగాణ DSCలో పలమనేరు విద్యార్థినికి ఫస్ట్ ర్యాంక్
తెలంగాణ విద్యాశాఖ నిర్వహించిన టీజీ డీఎస్సీ-24 ఫలితాలలో పలమనేరుకు చెందిన తహసీనా ప్రతిభ చూపింది. తహసీనా 75.57 శాతం మార్కులతో ఉర్దూ మీడియంలో తొలి ర్యాంకు సాధించింది. విద్యార్థిని తండ్రి సుందర్ పట్టణంలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. డీఎస్పీ టాపర్గా నిలిచిన విద్యార్థినిని పలువురు అభినందించారు.