News October 13, 2025

చిత్తూరు జిల్లా ప్రజలకు గమనిక

image

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు తమ సమస్యలపై వినతులు ఇవ్వొచ్చని ఆయన కోరారు.

Similar News

News October 12, 2025

చిత్తూరు జిల్లా ప్రజలకు గమనిక

image

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేధిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు తమ సమస్యలపై వినతులు ఇవ్వొచ్చని ఆయన కోరారు.

News October 12, 2025

పెద్దపంజాణిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు!

image

పెద్దపంజాణి మండలం వీర పల్లె కొండపై గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతుండగా అర్ధరాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు సమాచారం. తవ్వకాలకు ఉపయోగిస్తున్న జేసీబీతో పాటు కారు, నాలుగు బైకులు, పూజా సామగ్రిని వారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు పుంగనూరు మండలానికి చెందిన వారిగా తెలుస్తోంది. మరో నలుగురు పరారీ కాగా వారికోసం గాలిస్తున్నారు.

News October 12, 2025

చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు

image

చిత్తూరు జిల్లాలో గత 24 గంటల్లో కురిసిన వర్షపాత వివరాలను అధికారులు తెలిపారు. అత్యధికంగా పెనుమూరు మండలంలో 31 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జీడి నెల్లూరులో 7.2, చిత్తూరు రూరల్ లో 5.4, కుప్పం 8.4, బంగారుపాలెం 1.6 యాదమరి 1, చిత్తూరు అర్బన్ 10.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్టు చెప్పారు. మొత్తం 7 మండలాలలో వర్షపాతం నమోదుకాగా 25 మండలాలలో వర్షం పడలేదన్నారు.