News April 12, 2025
చిత్తూరు జిల్లా లాస్ట్

ఇంటర్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా వెనుకబడింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇయర్లో 13,183 మంది పరీక్షలు రాయగా కేవలం 7,168 మందే పాసయ్యారు. 54 శాతం పాస్ పర్సంటేజీతో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానం(26)లో నిలిచింది. సెకండ్ ఇయర్లో 11,450 మందికి 8,440 మందే పాసయ్యారు. 74 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 24వ స్థానంలో చిత్తూరు జిల్లా నిలిచింది.
Similar News
News April 10, 2026
చిత్తూరు: ఫేక్ సర్టిఫికెట్లు… ముగ్గురు ఉద్యోగుల తొలగింపు

తప్పుడు విద్యార్హత సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందిన ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లను తొలగిస్తూ కర్నూలు ఉప లోకాయుక్త జస్టిస్ రజిని ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా వైద్యారోగ్యశాఖలో 2024లో ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులు భర్తీ చేశారు. ఇందులో అక్రమాలు జరిగినట్లు తేలింది. దీంతో గంగవరం ప్రభుత్వాసుపత్రి ల్యాబ్ టెక్నీషియన్ వి.నాగవేణితో పాటు, నాగలాపురం, మదనపల్లెలో మరో ఇద్దరిని తొలగించారు.
News April 10, 2026
పోషకాహార లోపాన్ని నివారించాలి: చిత్తూరు కలెక్టర్

చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టరేట్లో పోషణ్ పక్వాడ అవగాహన పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కరించారు. అంగన్వాడీ ప్రీ స్కూల్ కిట్ను పరిశీలించారు. ఆరోగ్యవంతమైన సమాజానికి పోషకాహారం ఎంతో కీలకమని తెలిపారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 10, 2026
పోషకాహార లోపాన్ని నివారించాలి: చిత్తూరు కలెక్టర్

చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టరేట్లో పోషణ్ పక్వాడ అవగాహన పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కరించారు. అంగన్వాడీ ప్రీ స్కూల్ కిట్ను పరిశీలించారు. ఆరోగ్యవంతమైన సమాజానికి పోషకాహారం ఎంతో కీలకమని తెలిపారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


