News September 4, 2025

చిత్తూరు జిల్లా విద్యార్థులకు గమనిక

image

చిత్తూరు జిల్లా విద్యార్థులు ఈనెల 30వ తేదీలోపు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని DEO వరలక్ష్మి కోరారు. దరఖాస్తుకు సర్టిఫికెట్లు అవసరం లేదని, పరీక్ష రాసే సమయానికి అన్ని సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ పిల్లలు రూ.50 పరీక్ష ఫీజు ఆన్‌లైన్ అప్లికేషన్ సమయంలో ఇచ్చే ఎస్బీఐ కలెక్ట్ లింక్‌లోనే చెల్లించాలన్నారు.

Similar News

News February 11, 2026

చిత్తూరు జిల్లా టీచర్లకు గమనిక

image

టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం(TIS)లో టీచర్లు నమోదు చేసిన తప్పుల సవరణకు విద్యాశాఖ అనుమతించిందని చిత్తూరు డీఈవో రాజేంద్రప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. టీచర్లు వారి వ్యక్తిగత వివరాలను పరిశీలించి ఏవైనా తప్పులుంటే తగిన ఆధారాలతో ఈనెల 14వ తేదీలోపు డీఈవో, ఆర్జేడీ కార్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. టీఐఎస్ డేటాలో హెచ్ఎంలు, టీచర్లు తప్పుడు సమాచారం పొందుపరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 11, 2026

చిత్తూరు: కోట్ల రూపాయలు విలువ చేసే భూమిపై కన్ను…!

image

అనంతపురం- చెన్నై హైవేలోని రొంపిచెర్ల(M) బండకిందలో రూ.3 కోట్లు విలువ చేసే సర్వే నంబర్ 32, 36 లో సుమారు 0.75 సెంట్ల భూమిని ఆక్రమించి చదును చేసుకున్నారు. 2,3 రోజులుగా ఈ తంతు జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో కబ్జాదారుడు ఒకడుగు ముందుకు వేసి కంచె వేసి మామిడి మొక్కలు నాటేశారు. 20 రోజుల క్రితం బడబళ్లవంక నుంచి ఎర్రబాపన చెరువుకు పోతున్న సప్లై ఛానల్‌ను పూడ్చివేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

News February 11, 2026

వెల్ఫేర్ హాస్టల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి: చిత్తూరు కలెక్టర్

image

జిల్లాలోని సంక్షేమ హాస్టల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జాయింట్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులతో సమీక్ష నిర్వహించారు. బృంద సభ్యులు ప్రతిరోజు హాస్టల్స్ తనిఖీ చేసి నివేదికలను తనకు అందజేయాలని సూచించారు. హాస్టల్స్‌లో పారిశుద్ధ్యంపై ఫిర్యాదులు వస్తే వార్డెన్‌పై చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. సంక్రమణ వ్యాధులు సోకకుండా చూడాలన్నారు.