News March 22, 2026
చిత్తూరు జిల్లా SP వినతి

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నట్లు SP ఆఫీసు వెల్లడించింది. ఉ.10:30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను జిల్లా స్థాయి పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాధితులకు తెలిపారు.
Similar News
News April 8, 2026
చిత్తూరు జిల్లాలో అదనంగా కోర్టులు.. కొత్త ఉద్యోగాలు!

APలో కొత్తగా 96 కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా చిత్తూరు జిల్లాలో 6 కోర్టులు రానున్నాయి. చిత్తూరులో 7వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు, మదనపల్లెలో మూడో అదనపు సివిల్ కోర్టు, పలమనేరులో మొదటి అదనపు సివిల్ కోర్టు, రెండో అదనపు సివిల్ కోర్టు, పుంగనూరులో రెండో అదనపు సివిల్ జడ్జి కోర్టు, వాయల్పాడులో మొదటి అదనపు సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కానుంది. వీటితో కొత్త ఉద్యోగాలు వస్తాయి.
News April 8, 2026
చిత్తూరు: 18 మండలాల్లో 40 డిగ్రీలు

చిత్తూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. 18 మండలాల్లో మంగళవారం నలభై డిగ్రీలకుపై ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎస్ఆర్ పురం 42.6, నగరి 42.4, విజయపురం 41.7, పలమనేరు 41.3, గంగవరం 40.9 డిగ్రీలు నమోదు అయింది. చిత్తూరు 41.8, గుడిపాల, తవణంపల్లె, బంగారు పాళ్యంలో 41.3, పూతలపట్టు, శాంతిపురం 41, గంగాధర నెల్లూరు 40.9, పెద్ద పంజాణి 40.6, పాలసముద్రం, పెనుమూరు, యాదమరిలో 40.2, ఐరాలలో 40 డిగ్రీల ఎండ కాసింది.
News April 7, 2026
కుప్పం: కడసారి చూపు కోసం 3 నెలలుగా ఎదురుచూపు

కుప్పం (M) గుండ్ల మడుగుకు చెందిన సురేశ్ బతుకుతెరువు కోసం 15 ఏళ్లుగా సౌదీ అరేబియాలో ఎలక్ట్రిక్ పని చేస్తున్నాడు. జనవరి 27న విద్యుత్ షాక్తో సురేశ్ మృతి చెందాడు. సురేశ్ మృతదేహాన్ని సౌదీ నుంచి తీసుకువచ్చేందుకు 3 నెలలుగా కుటుంబ సభ్యులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విషయం CM చంద్రబాబుకు తెలియడంతో కలెక్టర్ ద్వారా సౌదీ అధికారులతో సంప్రదింపులు జరిపి మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితం బెంగళూరుకు తీసుకొచ్చారు.


