News October 9, 2024
చిత్తూరు నూతన DFOగా భరణి

చిత్తూరు జిల్లా నూతన అటవీశాఖ అధికారిణిగా భరణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేస్తున్న చైతన్య కుమార్ రెడ్డిని ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ నుంచి బదిలీపై వచ్చిన భరణి నూతన డీఎఫ్వోగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. అందరి సహకారంతో అటవీశాఖ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
Similar News
News February 13, 2026
చిత్తూరు: 2.25 లక్షల రుద్రాక్షలతో మహా శివలింగం ఎక్కడో తెలుసా..

గుడిపల్లి (M) మల్లప్ప కొండపై నెలకొని ఉండు శ్రీ మల్లేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. మహాశివరాత్రి సందర్భంగా మల్లప్ప కొండపై 2.25 లక్షల రుద్రాక్షలతో భారీ శివలింగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మహాశివరాత్రి వేడుకలకు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో రానున్న నేపథ్యంలో మహాశివరాత్రికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
News February 13, 2026
కల్తీపాల వ్యవహారంలో కుప్పం వాసులు.!

కుప్పం, పలమనేరు అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో కల్తీ పాల తయారీ గుట్టురట్టైంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ పరిధిలో ప్రత్యేక దాడులు నిర్వహించిన పోలీసులు, మిల్క్ పౌడర్, పామ్ ఆయిల్తో కల్తీ పాలు తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం మండలాలకు చెందిన నలుగురు ఈ వ్యవహారంలో ఉన్నట్లు గుర్తించారు. వీరు పాలను కర్ణాటకలో విక్రయించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
News February 13, 2026
హైవేలపై ప్రాణాలు పోతున్నాయ్: MLA

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న ప్రమాదాల్లో ఏడాదికి 400 మంది వరకు చనిపోతున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ చెప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘జగమర్ల నుంచి నేండ్రగుంట వరకు ఉన్న హైవేపై ఎక్కడ ప్రమాదం జరిగినా తిరుపతి రుయా లేదా వేలూరు ఆసుపత్రికి తరలించాలి. ఈలోపు ప్రాణాలు పోతున్నాయి. పి.కొత్తకోట వద్ద 50 బెడ్లతో ట్రామాకేర్ ఏర్పాటు చేయాలి’ అని MLA కోరారు.


