News May 5, 2024

చిత్తూరు: బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొననున్న ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైంది. ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉద్యోగులు ఓటు వేస్తున్నారు. పుంగనూరు పట్టణంలోని బసవరాజ పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం కావడంతో సీఐ రాఘవరెడ్డి ఓటింగ్ సరళిని పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఓటర్లు నడుచుకోవాలని సూచించారు.

Similar News

News October 21, 2025

చిత్తూరు: ఇకనైనా మైనింగ్ మాఫియాకి చెక్ పడేనా..?

image

చిత్తూరులో కొంత కాలంగా రాయల్టీ పైకానికి బ్రేక్ పడింది. రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీ టెండర్ గత నెలాఖరుతో ముగిసింది. నేరుగా మైనింగ్ అధికారుల పర్యవేక్షణలో గ్రానైట్, గ్రావెల్ తరలింపు కొనసాగుతోంది. నూతన టెండర్ ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మరో 3 నెలలు రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి పొడిగిస్తారా..? లేక నూతన టెండర్ ఖరారు చేస్తారా? అనే అంశం మరి కొన్నిరోజుల్లో తేలనుంది.

News October 21, 2025

మిమ్మల్ని చిత్తూరు ప్రజలు మరవలేరు..!

image

2020 నవంబర్ 8న సరిహద్దుల్లో ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో ఐరాల(M) రెడ్డివారిపల్లెకు చెందిన జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వీరమరణం పొందారు. 2007లో చిత్తూరులో CKబాబుపై జరిగిన హత్యాయత్నంలో గన్‌మెన్స్ హుస్సేన్ బాషా, సురేంద్ర అమరులయ్యారు. 2017లో పలమనేరు అడవుల్లో మహిళను అత్యాచారం చేయబోయారు. నిందితులను పట్టుకోవడానికి వెళ్లిన కానిస్టేబుల్ జవహర్ నాయక్, హోంగార్డు దేవంద్ర చనిపోయారు.
#నేడు అమరవీరుల దినోత్సవం

News October 20, 2025

చిత్తూరులో PGRS రద్దు

image

దీపావళి పండుగ కారణంగా సోమవారం కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయంలో జరగాల్సిన PGRS కార్యక్రమాలను రద్దు చేశారు. ప్రజలు ఎవరూ వ్యయ ప్రయాసల కోర్చి జిల్లా కేంద్రానికి రావద్దని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ ఒక ప్రకటనలో సూచించారు.