News April 22, 2024
చిత్తూరు: మండుతున్న ఎండలు

చిత్తూరు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిండ్రలో 42.6, పులిచెర్లలో 42.4 పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే తవణంపల్లె 41.7, గుడుపల్లె 41.7, పెద్దపంజాణి 41.5, శ్రీరంగరాజపురం 41.4, గుడిపాల 41.2, పుంగనూరు 41.2, సదుం, బంగారుపాలెంలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రాత్రి వేళల్లోనూ 33 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు అవుతోంది.
Similar News
News October 11, 2025
అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదు: కలెక్టర్

చిత్తూరు జిల్లాలో అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం, జడ్పీ నిధులు మంజూరు చేస్తామన్నారు. పంచాయతీ రాజ్, RWS శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై కలెక్టరేట్ నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. నవంబరులోగా ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో తాగునీటి సమస్య లేకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు.
News October 11, 2025
పోలీస్ ట్రైనింగ్ సెంటర్ పరిశీలించిన చిత్తూరు ఎస్పీ

చిత్తూరులో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ను ఎస్పీ తుషార్ డూడీ శుక్రవారం పరిశీలించారు. త్వరలోనే రిక్రూట్ కానిస్టేబుల్లకు శిక్షణ ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. శిక్షణ ప్రమాణాలు అత్యుత్తమంగా ఉండేలా అన్ని విభాగాలను ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వసతి గదులు పరిశుభ్రంగా గాలి, వెలుతురు ఉండేలా చూడాలని ఆదేశించారు.
News October 10, 2025
రేపు దేవళంపేటలో పర్యటించనున్న మంత్రి

వెదురుకుప్పం మండలం దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహాన్ని హోం మంత్రి అనిత శనివారం పరిశీలించనున్నట్లు జీడీనెల్లూరు నియోజకవర్గ టీడీపీ నాయకులుతెలిపారు. ఉదయం 10 గంటలకు ఆమెతోపాటు ఎమ్మెల్యే డాక్టర్ థామస్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు హాజరవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొనాలని కోరారు.