News April 25, 2024
చిత్తూరు: మాజీ సీఎంపై ఒకే ఒక్క కేసు

రాజంపేట లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య ఇందిరా రెడ్డి దంపతుల ఉమ్మడి ఆస్తులు రూ.75.65 కోట్లు. ఆయనపై ఈ నెల 7న రొంపిచర్లలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కేసు నమోదైంది. ఇతరత్రా కేసులు లేవు.
Similar News
News October 13, 2025
చిత్తూరు: నేటి నుంచి విధుల్లోకి కొత్త టీచర్లు

DSC-2025 ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ఇవాళ వారికి కేటాయించిన పాఠశాలలో జాయిన్ కానున్నారు. ఈ మేరకు DEO వరలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. నూతన ఉపాధ్యాయులు 11 రోజుల శిక్షణ పూర్తిచేసుకున్నారు. SGTలకు మ్యానువల్ పద్ధతిలో స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించారు.
News October 13, 2025
చిత్తూరు జిల్లా ప్రజలకు గమనిక

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు తమ సమస్యలపై వినతులు ఇవ్వొచ్చని ఆయన కోరారు.
News October 12, 2025
చిత్తూరు జిల్లా ప్రజలకు గమనిక

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేధిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు తమ సమస్యలపై వినతులు ఇవ్వొచ్చని ఆయన కోరారు.