News March 24, 2024
చిత్తూరు: ముగ్గురు వాలంటీర్ల తొలగింపు

చిత్తూరు జిల్లా సదుం మండలం ఊటుపల్లె సచివాలయ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ ఎంపీడీవో రాజశేఖర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. B.గురుమూర్తి, ఎం.ఈశ్వ రయ్య, కె.బాలాజీ ఈనెల 19న వైసీపీ నిర్వహించిన బైకు ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని బీసీవై పార్టీ నాయకులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నట్లు ఎంపీడీవో వివరించారు.
Similar News
News April 21, 2025
మే 6 నుంచి తిరుపతి గంగమ్మ జాతర

తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ జాతర మే 6 నుంచి ప్రారంభం కానుంది. 6న చాటింపు వేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. 7న బైరాగి వేషం, 8న బండ వేషం, 9న తోటి వేషం, 10న దొర వేషం, 11న మాతంగి వేషం, 12న సున్నపు కుండలు, 13న అమ్మవారి జాతర జరగనుంది. 14న ఉదయం చంప నరకడంతో అమ్మవారి జాతర ముగుస్తుంది. పుష్ప-2లోనూ ఈ జాతర ప్రస్తావన వచ్చిన విషయం తెలిసిందే
News April 21, 2025
కుప్పంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

కుప్పం నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కరించడం లక్ష్యంగా కుప్పంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కడ పిడి వికాస్ మర్మత్ తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10.గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఏమైనా సమస్యలు ఉంటే అధికారులు దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలకు సూచించారు. అర్జీదారులు సద్వినియోగం చేసుకొవాలి
News April 20, 2025
కుప్పం: వేలిముద్రలతో సీఎం చంద్రబాబు చిత్రం

సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజును పురస్కరించుకొని కుప్పం పూరి ఆర్ట్స్ పురుషోత్తం వినూత్నంగా వేసిన థంబ్ ఆర్ట్ చిత్రాన్ని కుప్పం టీడీపీ కార్యాలయానికి అందజేశారు. కాగా చంద్రబాబు థంబ్ ఆర్ట్ చిత్రంలో మేము సైతం అంటూ టీడీపీ కుప్పం ఇన్ఛార్జ్ మునిగత్నం, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ తో పాటు టీడీపీ ముఖ్య నేతలు తమ వేలిముద్రలను వేశారు. ఈ చిత్రం కాస్త పార్టీ కార్యాలయంలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది.